News October 24, 2024

రేపు ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేస్తాం: బండి

image

TG: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా రేపు ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహిస్తామని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రకటించారు. మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని, కాంగ్రెస్ దోపిడీకి, పేదల ఇళ్ల కూల్చివేతలకు తాము వ్యతిరేకమన్నారు. మూసీ ప్రాజెక్ట్ ఓ పెద్ద స్కామ్ అని బండి ఆరోపించారు. ఉద్యోగులకు సరిగ్గా జీతాలు ఇవ్వలేని ప్రభుత్వానికి మూసీ కోసం రూ.1.50 లక్షల కోట్లు ఎక్కడివని నిలదీశారు.

Similar News

News March 17, 2025

కోల్‌కతా వైద్యురాలి తల్లిదండ్రుల పిటిషన్ కొట్టివేత

image

కోల్‌కతా ఆర్జీకర్ వైద్యురాలి హత్యాచారం కేసుకు సంబంధించి మళ్లీ CBI విచారణ చేయించాలని ఆమె తల్లిదండ్రులు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ విచారణ జరిపిన కోర్టు దాన్ని కొట్టేస్తూ.. కోల్‌కతా హైకోర్టులో పిటిషన్ కొనసాగించవచ్చని సూచించింది. గతేడాది ఆగస్టు 9న ఆస్పత్రి సెమినార్‌ రూమ్‌లో ఒంటరిగా నిద్రిస్తున్న వైద్యురాలిపై అఘాయిత్యం జరిగింది. నిందితుడు సంజయ్‌కు కోర్టు జీవిత ఖైదు విధించిన విషయం తెలిసిందే.

News March 17, 2025

TG ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో శ్రీవారి దర్శనం: TTD

image

తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో వచ్చే వారికి తిరుమల శ్రీవారి దర్శనం కల్పించాలని TTD నిర్ణయించింది. ఈ నెల 24 నుంచి ఇది అమలులోకి రానుంది. వీఐపీ బ్రేక్, రూ.300 దర్శనాలకు వీరిని అనుమతించనున్నారు. సోమ, మంగళ వారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు, బుధ, గురువారాల్లో రూ.300 ప్రత్యేక దర్శనాలు ఉంటాయి. ఒక్కో ప్రజాప్రతినిధికి రోజుకు ఒక లేఖకు అనుమతి ఇవ్వనుండగా, ఒక్కో లేఖపై ఆరుగురికి దర్శనం కల్పిస్తారు.

News March 17, 2025

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టికి క్యాన్సర్? నిజమిదే!

image

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి క్యాన్సర్‌తో బాధపడుతున్నారంటూ గత కొన్నిరోజులుగా ప్రచారంలో ఉన్న వార్తలకు ఆయన టీమ్ ఫుల్‌స్టాప్ పెట్టింది. ‘మమ్ముట్టి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. రంజాన్ కావడంతో ఉపవాసం చేస్తున్నారు. అందుకే సినిమా షూటింగ్స్‌నుంచి విరామం తీసుకున్నారు. ప్రచారంలో ఉన్నది పూర్తిగా అవాస్తవం’ అని స్పష్టం చేసింది. కాగా తన తర్వాతి సినిమాలో మమ్ముట్టి, మోహన్‌లాల్‌తో కలిసి నటించనుండటం విశేషం.

error: Content is protected !!