News October 24, 2024
రేపు ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేస్తాం: బండి
TG: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా రేపు ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహిస్తామని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రకటించారు. మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని, కాంగ్రెస్ దోపిడీకి, పేదల ఇళ్ల కూల్చివేతలకు తాము వ్యతిరేకమన్నారు. మూసీ ప్రాజెక్ట్ ఓ పెద్ద స్కామ్ అని బండి ఆరోపించారు. ఉద్యోగులకు సరిగ్గా జీతాలు ఇవ్వలేని ప్రభుత్వానికి మూసీ కోసం రూ.1.50 లక్షల కోట్లు ఎక్కడివని నిలదీశారు.
Similar News
News October 24, 2024
ఈ ఎలుక చాలా స్పెషల్
ఇంట్లో ఆహార పొట్లాలకు చిల్లులు పెట్టి చిత్తడి చేసే ఎలుక కాదిది. ల్యాండ్మైన్లు, క్షయవ్యాధిని గుర్తించగలిగేలా శిక్షణ పొందిన ర్యాట్ ఇది. దీని పేరు మగావా. బెల్జియం ఛారిటీ సంస్థ APOPOలో మగావా శిక్షణ పొందింది. ఐదేళ్ల కెరీర్లో ఈ చిట్టెలుక కంబోడియాలో 100కి పైగా ల్యాండ్మైన్లు, పేలుడు పదార్థాలను పసిగట్టింది. దీని వీరత్వానికి బంగారు పతకం కూడా లభించింది. ఇది జనవరి 2022లో చనిపోయింది.
News October 24, 2024
తమిళ తంబీల దెబ్బకు కుప్పకూలిన కివీస్
రెండో టెస్టులో తమిళ తంబీలు వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్ దెబ్బకు న్యూజిలాండ్ జట్టు కుప్పకూలిపోయింది. అనూహ్యంగా జట్టులో చోటు దక్కించుకున్న సుందర్ సంచలన ప్రదర్శన చేశారు. గింగిరాలు తిరిగే బంతులతో కివీస్ ఆటగాళ్లను ముప్పతిప్పలు పెట్టారు. మొత్తం ఏడుగురు కివీస్ బ్యాటర్లను పెవిలియన్కు పంపారు. మరోవైపు అశ్విన్ కూడా 3 వికెట్లతో చెలరేగడంతో పర్యాటక జట్టు ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది.
News October 24, 2024
రూ.50 వేల కోట్లతో పనులు: చంద్రబాబు
AP: రాబోయే రెండున్నరేళ్లలో రూ.50 వేల కోట్లతో రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేపడతామని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘రాష్ట్రంలో ప్రస్తుతం 47 పనులు కొనసాగుతున్నాయి. 15 ప్రాజెక్టులు నిలిచిపోయాయి. వీటిలో కొన్నిటికి భూసేకరణ, అటవీ, పర్యావరణ అనుమతుల సమస్యలు ఉన్నాయి. బెంగళూరు-కడప, విజయవాడ ఎక్స్ప్రెస్ వే పనుల్లో జాప్యం జరుగుతోంది. ఇందుకు సంబంధించి పర్యావరణ అనుమతులు సాధించాలి’ అని ఆయన పేర్కొన్నారు.