News October 24, 2024
VIRAL: నర్సరీ ఫీజు రూ.1.51లక్షలు!
ఓ ప్రైవేట్ స్కూల్లో నర్సరీకి రూ.1.51లక్షల ఫీజు అని తెలిపే ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని బెంగళూరుకు చెందిన ఓ డాక్టర్ Xలో పోస్ట్ చేశారు. ‘ఇందులో పేరెంట్ ఓరియంటేషన్ ఫీజు రూ.8,400 అని ఉంది. డాక్టర్ కన్సల్టేషన్ కోసం ఈ ఫీజులో కనీసం 20% చెల్లించేందుకు కూడా పేరెంట్స్ ఆసక్తి చూపించరు. అందుకే నేనిప్పుడు ఓ స్కూల్ను ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా’ అని ఆ డాక్టర్ పేర్కొన్నారు. దీనిపై మీ కామెంట్?
Similar News
News October 24, 2024
YouTube వీడియోలు చూస్తూ జాబ్ కొట్టింది!
గిరిజన ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల బిని ముదులి యూట్యూబ్ వీడియోలు చూస్తూ ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సత్తాచాటారు. నెట్వర్క్ లేకపోవడంతో ఇతర ప్రాంతానికి వెళ్లి యూట్యూబ్ వీడియోలు, ఆన్లైన్ మాక్ టెస్ట్ల ద్వారా ప్రిపేర్ అయి 596వ ర్యాంకు సాధించారు. దీంతో OCSలో ఉద్యోగం పొందిన తొలి బోండా జాతి యువతిగా ఆమె చరిత్ర సృష్టించారు. పేరెంట్స్ కోచింగ్ ఫీజు చెల్లించలేరని, సొంతంగా ప్రిపేర్ అయినట్లు ఆమె తెలిపారు.
News October 24, 2024
అమెరికా, చైనా.. రెండూ భారత్ను విస్మరించలేవు: నిర్మల
భారత్ లక్ష్యం ప్రపంచాన్ని ప్రభావితం చేయడమే కానీ ఆధిపత్యం చెలాయించడం కాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. నేడు భారత్ ఉన్న స్థాయిని అటు US, ఇటు చైనా రెండూ విస్మరించలేవని గుర్తుచేశారు. ‘మనది అతి పెద్ద ప్రజాస్వామ్యం. అతి పెద్ద జనాభా కలిగిన దేశం. భూమ్మీద ఉన్న ప్రతి ఆరుగురిలో ఒకరు భారతీయుడే. మన ఆర్థిక వ్యవస్థను పట్టించుకోకుండా ఉండటం ఎవరికైనా అసాధ్యం’ అని స్పష్టం చేశారు.
News October 24, 2024
బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి ఎవరికి?
BJP జాతీయ అధ్యక్ష ఎన్నికపై ఆసక్తి నెలకొంది. ఈ సారి దక్షిణాది నేతకు ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉంది. అదే గనక జరిగితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రేసులో ముందున్నట్టు తెలుస్తోంది. కర్ణాటక, తెలంగాణ, AP, కేరళలో పార్టీ బలోపేతానికి ఇది దోహదపడుతుందని పార్టీ పెద్దలు భావిస్తున్నారు! ఉత్తరాది విషయానికొస్తే రాజ్నాథ్ సింగ్, శివరాజ్సింగ్ చౌహాన్, వినోద్ తావ్డే, సునీల్ బన్సల్ రేసులో ఉన్నారు.