News October 24, 2024

వాంతులు, విరేచ‌నాల‌తో ఇద్ద‌రు మృతి.. మంత్రి కీలక ఆదేశాలు

image

AP: ప‌ల్నాడు(D) దాచేప‌ల్లిలో వాంతులు, విరేచ‌నాల‌తో ఇద్ద‌రు వ్య‌క్తుల మృతిపై మంత్రి నారాయ‌ణ స‌మీక్ష‌ నిర్వహించారు. వారి మృతికి నీరు క‌లుషితం కావ‌డమే కారణమా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉందన్నారు. స్థానికంగా ఉన్న బోర్ల‌లో నీటిని విజ‌య‌వాడ ల్యాబ్‌కు ప‌రీక్ష‌ల‌కు పంపాల‌ని ఆదేశించారు. బోర్ల‌ను మూసివేసి వాట‌ర్ ట్యాంక‌ర్ల ద్వారా తాగునీరు స‌ర‌ఫ‌రా చేయాల‌ని సూచించారు. హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు.

Similar News

News October 24, 2024

రేషన్ షాపుల్లో సన్న బియ్యం.. ఎప్పుడంటే?

image

TG: జనవరి నుంచి రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తామని పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఒక్కో వ్యక్తికి 6 కిలోల చొప్పున బియ్యం అందజేస్తామని చెప్పారు. ప్రభుత్వం రూ.20 వేల కోట్లతో ధాన్యం సేకరిస్తోందని, ఈ సీజన్‌లో 150 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ప్రతి ఏటా 6 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు తీసుకొస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

News October 24, 2024

ప్రధాని మోదీని కలిసిన ఒమర్ అబ్దుల్లా

image

జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రధాని మోదీతో ఢిల్లీలో భేటీ అయ్యారు. J&Kకు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని J&K క్యాబినెట్ చేసిన తీర్మాన పత్రాన్ని ప్రధానికి అందజేశారు. అంతకుముందు అబ్దుల్లా.. కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, రాజ్‌నాథ్ సింగ్‌లను కలిశారు. J&Kలో రహదారుల అనుసంధానాన్ని పెంచాలని కోరారు.

News October 24, 2024

రేపే ‘ఫౌజీ’ సెట్‌లోకి ప్రభాస్!

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో ‘ఫౌజీ’ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రేపు, ఎల్లుండి హైదరాబాద్ బీహెచ్ఈఎల్‌లో జరిగే షూటింగ్‌లో ప్రభాస్ పాల్గొంటారని తెలుస్తోంది. అలాగే వచ్చే నెల 3, 4 తేదీల్లో కూడా ఇదే సెట్‌లో ఆయన మళ్లీ షూట్‌లో పాల్గొంటారని సమాచారం. కాగా ఈ చిత్రంలో ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తున్నారు. మృణాల్ ఠాకూర్, జయప్రద కీలక పాత్రలు పోషిస్తున్నట్లు టాక్.