News October 24, 2024
అందుకే రైల్వే ప్రాజెక్టుల ఆలస్యం: కిషన్రెడ్డి
రాష్ట్రాలు వాటా ఇవ్వకపోవడంతో కొన్ని రైల్వే ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. దక్షిణ మధ్య రైల్వేలో 40 స్టేషన్లను ఆధునీకరిస్తామని ఆయన వెల్లడించారు. కాజీపేటలో రూ.680కోట్లతో తయారీ యూనిట్ రాబోతోందన్నారు. రాష్ట్రం నుంచి సహకారం లేకపోయినా రూ.650కోట్లతో MMTS పొడిగిస్తామన్నారు.
Similar News
News October 24, 2024
‘బాలయ్య పండుగ’.. రేపు సెలవివ్వాలని ప్లకార్డుల ప్రదర్శన
సీనియర్ హీరో బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తోన్న ‘అన్స్టాపబుల్ షో’ సీజన్ 4 రేపటి నుంచి ప్రసారం కానుంది. ఈ కార్యక్రమానికి గెస్ట్గా ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ క్రమంలో రేపు సెలవు ఇవ్వాలని ఐటీ ఉద్యోగులు ప్లకార్డులు ప్రదర్శించారు. అక్టోబర్ 25ను బాలయ్య పండుగగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరలవుతున్నాయి.
News October 24, 2024
ఖలిస్థానీలకు కెనడా అందమైన దేశం: సంజయ్ వర్మ
ఖలిస్థానీ ఉగ్రవాదులకు, మద్దతుదారులకు కెనడా ఓ అందమైన దేశమని, అక్కడి సున్నితమైన న్యాయ వ్యవస్థ వల్ల వారు ఆశ్రయం పొందుతున్నారని దౌత్యవేత్త సంజయ్ వర్మ వ్యాఖ్యానించారు. నిజ్జర్ హత్య కేసులో తనను అనుమానితుల జాబితాలో చేర్చడం షాక్కు గురి చేసిందని, ఇదోరకమైన వెన్నుపోటని పేర్కొన్నారు. తమ వేర్పాటువాదానికి మద్దతు ఇవ్వాలని ఖలిస్థానీలు ఇతర సిక్కులను బెదిరిస్తున్నారని అన్నారు.
News October 24, 2024
బిగ్బాస్ నుంచి బయటికి గంగవ్వ?
బిగ్బాస్ హౌస్లో ఉన్న గంగవ్వను షో నిర్వాహకులు బయటికి పంపించనున్నట్లు టాక్ నడుస్తోంది. ఆమె మీద <<14433584>>కేసు<<>> నమోదైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారని అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. యూట్యూబ్ వీడియో కోసం రామచిలకను హింసించారంటూ గంగవ్వ, యూట్యూబర్ రాజుపై గౌతమ్ అనే జంతు సంరక్షకుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.