News October 24, 2024

ఒక్కో కార్మికుడికి రూ.93,750.. దీపావళి బోనస్ రిలీజ్

image

TG: ఒక్కో కార్మికుడికి దీపావళి బోనస్‌గా సింగరేణి యాజమాన్యం రూ.93,750 ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా యాజమాన్యం బోనస్ అమౌంట్ రూ.358 కోట్లు రిలీజ్ చేసింది. అంతకుముందు లాభాల వాటా రూ.796 కోట్లను కార్మికుడికి సగటున రూ.1.90 లక్షలు అందజేసిన సంగతి తెలిసిందే.

Similar News

News October 24, 2024

ఆర్మీ వాహనంపై ఉగ్రదాడి.. ఐదుగురు సైనికులకు గాయాలు

image

క‌శ్మీర్‌లో ఉగ్ర‌మూక‌లు మ‌రో దాడికి తెగ‌బ‌డ్డాయి. ఉత్తర కశ్మీర్‌లోని గుల్‌మార్గ్ బోటాపతేర్ ప్రాంతంలో సైనికుల వాహ‌నంపై ఉగ్ర‌వాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు సైనికులు గాయ‌ప‌డిన‌ట్టు తెలుస్తోంది. గంద‌ర్బాల్‌లో ఓ కార్మికుడిపై కాల్పులు జ‌రిగిన కొన్ని గంటల్లోనే ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News October 24, 2024

అశ్విన్ సూచనలతోనే 7 వికెట్లు తీయగలిగా: వాషింగ్టన్

image

న్యూజిలాండ్‌పై తాను 7 వికెట్లు తీయడం వెనుక తన తోటి స్పిన్నర్ అశ్విన్ ఇచ్చిన సూచనలు కీలకమయ్యాయని వాషింగ్టన్ సుందర్ తెలిపారు. ‘బాల్ బాగా సాఫ్ట్‌గా మారడంతో వికెట్ల కోసం బంతిని వేగంగా విసరాలని అశ్విన్ సూచించారు. ఆ టెక్నిక్‌తోనే కాన్వేను ఆయన ఔట్ చేశారు. ఆ సూచన పాటించడంతో పాటు సరైన ప్రాంతాల్లో బంతిని వేయడం ద్వారా వికెట్లు తీయగలిగాను. అశ్విన్‌తో కలిసి మరిన్ని మ్యాచులు ఆడాలనుకుంటున్నాను’ అని వివరించారు.

News October 24, 2024

ఎన్విడియా ఫౌండర్‌ జెన్సన్‌తో లోకేశ్ భేటీ

image

AP: ఎన్విడియా వ్యవస్థాపకుడు జెన్సన్ హువాంగ్‌తో మంత్రి నారా లోకేశ్ భేటీ అయ్యారు. ముంబైలో జరిగిన ఎన్విడియా ఏఐ సమ్మిట్‌లో వీరిద్దరూ కలుసుకున్నారు. అమరావతిలో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటులో సూచనలు, మద్దతు ఇవ్వాల్సిందిగా జెన్సన్‌ను కోరినట్లు లోకేశ్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. అలాగే భవిష్యత్‌లో ఏఐ విస్తరణపై కూడా చర్చించినట్లు తెలిపారు. మళ్లీ ఆయనను కలుసుకునేందుకు తహతహలాడుతున్నానంటూ పేర్కొన్నారు.