News October 24, 2024
Stock Market: ఫ్లాట్గా ముగిశాయి

వరుస నష్టాలతో డీలాపడిన దేశీయ స్టాక్మార్కెట్లు గురువారం ఫ్లాట్గా ముగిశాయి. 80,170 వద్ద బలమైన రెసిస్టెన్స్ను దాటలేకపోయిన సెన్సెక్స్ చివరికి 16 పాయింట్ల నష్టంతో 80,065 వద్ద స్థిరపడింది. ఉదయం అరగంట నష్టాలను 24,350 వద్ద సపోర్ట్ తీసుకొని అధిగమించిన నిఫ్టీ చివరకు 36 పాయింట్లు కోల్పోయి 24,399 వద్ద నిలిచింది. Ultratech 2.66% లాభపడగా, HindUnilvr 5.8% నష్టపోయింది.
Similar News
News January 27, 2026
ఫిబ్రవరి తొలివారంలో రైతులకు రూ.2వేలు?

దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు శుభవార్త చెప్పేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం అదే వారంలో పీఎం కిసాన్ పథకంలో భాగంగా అన్నదాతల ఖాతాల్లో రూ.2వేల చొప్పున జమ చేస్తుందని సమాచారం. మరోవైపు ఏపీ ప్రభుత్వం మరో రూ.4వేలు కలిపి మొత్తం రూ.6వేలను అన్నదాతలకు అందించే అవకాశం ఉంది. కాగా రైతులు తప్పనిసరిగా E-KYC చేయించుకోవాలి. లేదంటే డబ్బులు జమ కావు.
News January 27, 2026
లంకను గెలిచిన ఇంగ్లండ్.. సిరీస్ కైవసం

శ్రీలంకతో జరిగిన <<18976263>>మూడో వన్డేలో<<>> ఇంగ్లండ్ 53 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో 2-1తో సిరీస్ను కైవసం చేసుకుంది. 358 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన లంక 46.4 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది. పవన్ రత్ననాయకే 121, పాతుమ్ నిస్సాంక 50 మినహా అందరూ విఫలమయ్యారు. కాగా మూడు టీ20ల సిరీస్ జనవరి 30 నుంచి ప్రారంభమవుతుంది.
News January 27, 2026
MLA వ్యవహారంలో నిజమేంటో తేల్చాలి: శైలజ

AP: జనసేన MLA <<18975483>>అరవ శ్రీధర్<<>>పై SMలో వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టాలని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. బాధితురాలితో ఫోన్లో మాట్లాడి ఘటనపై వివరాలు సేకరించినట్లు తెలిపారు. మహిళ గౌరవం, భద్రతకు భంగం కలిగించే చర్యలను సహించబోమని స్పష్టం చేశారు. ఘటనలో నిజానిజాలు తేల్చి బాధితురాలికి అండగా ఉంటామన్నారు. దీనిపై జనసేన అంతర్గత బృందం విచారణ జరిపి పవన్కు నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.


