News October 24, 2024
‘రాజాసాబ్’ మోషన్ పోస్టర్.. 24 గంటల్లో 8.3M వ్యూస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ సినిమా నుంచి నిన్న మోషన్ పోస్టర్ రిలీజైన విషయం తెలిసిందే. ఈ వీడియోకు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. రిలీజైన 24 గంటల్లోనే దీనికి 8.3 మిలియన్ల వ్యూస్ వచ్చినట్లు మేకర్స్ ప్రకటిస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. రికార్డ్స్ & ప్రభాస్ ఒకే పేజీలో ఉంటారని, యూట్యూబ్లో ఈ వీడియో ట్రెండింగ్లో ఉందని పేర్కొన్నారు.
Similar News
News October 24, 2024
ఎన్విడియా ఫౌండర్ జెన్సన్తో లోకేశ్ భేటీ
AP: ఎన్విడియా వ్యవస్థాపకుడు జెన్సన్ హువాంగ్తో మంత్రి నారా లోకేశ్ భేటీ అయ్యారు. ముంబైలో జరిగిన ఎన్విడియా ఏఐ సమ్మిట్లో వీరిద్దరూ కలుసుకున్నారు. అమరావతిలో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటులో సూచనలు, మద్దతు ఇవ్వాల్సిందిగా జెన్సన్ను కోరినట్లు లోకేశ్ ఎక్స్లో ట్వీట్ చేశారు. అలాగే భవిష్యత్లో ఏఐ విస్తరణపై కూడా చర్చించినట్లు తెలిపారు. మళ్లీ ఆయనను కలుసుకునేందుకు తహతహలాడుతున్నానంటూ పేర్కొన్నారు.
News October 24, 2024
2 రాష్ట్రాల్లో వారి కోసం కేజ్రీవాల్ ప్రచారం
మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో INDIA కూటమి తరఫున ఢిల్లీ EX CM కేజ్రీవాల్ ప్రచారం చేయనున్నట్టు సమాచారం. ఈ విషయమై శివసేన UBT, NCP SP కేజ్రీవాల్ను సంప్రదించినట్టు తెలిసింది. MHలో ఆప్ క్యాడర్ ఉన్న స్థానాల్లో వివాదాస్పద నేపథ్యం లేని అభ్యర్థుల తరఫున ఆయన ప్రచారం చేస్తారని సమాచారం. హేమంత్ సోరెన్కు మద్దతుగా ఝార్ఖండ్లో ప్రచారం చేస్తారని ఆప్ వర్గాలు చెప్పాయి.
News October 24, 2024
ఎన్డీయేలోని కీలక రాష్ట్రాలకు కేంద్రం రైల్వే కానుకలు
NDAలో కీలక భాగస్వాములైన ఏపీ, బిహార్లకు కేంద్రం ముఖ్యమైన రైల్వే ప్రాజెక్టులు మంజూరు చేసింది. ఏపీలో ₹2,245 కోట్ల విలువైన 57 KM అమరావతి లైన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు బిహార్కు ₹4,553 కోట్ల విలువైన 2 రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ 2 రాష్ట్రాలకే రూ.6,798 కోట్ల విలువైన ప్రాజెక్టులు కేటాయించడం దేశవ్యాప్తంగా రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.