News October 24, 2024
ఈ ఎలుక చాలా స్పెషల్
ఇంట్లో ఆహార పొట్లాలకు చిల్లులు పెట్టి చిత్తడి చేసే ఎలుక కాదిది. ల్యాండ్మైన్లు, క్షయవ్యాధిని గుర్తించగలిగేలా శిక్షణ పొందిన ర్యాట్ ఇది. దీని పేరు మగావా. బెల్జియం ఛారిటీ సంస్థ APOPOలో మగావా శిక్షణ పొందింది. ఐదేళ్ల కెరీర్లో ఈ చిట్టెలుక కంబోడియాలో 100కి పైగా ల్యాండ్మైన్లు, పేలుడు పదార్థాలను పసిగట్టింది. దీని వీరత్వానికి బంగారు పతకం కూడా లభించింది. ఇది జనవరి 2022లో చనిపోయింది.
Similar News
News October 24, 2024
జస్టిస్ సంజీవ్ ఖన్నా నేపథ్యం
సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ సంజీవ్ ఖన్నా మే 14, 1960లో జన్మించారు. 1983లో ఢిల్లీ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 2005లో ఢిల్లీ HCలో అదనపు న్యాయమూర్తిగా నియమితులై 2006లో శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అనంతరం 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తదుపరి CJIగా ఆయన 183 రోజులపాటు బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
News October 24, 2024
శారదా పీఠానికి భూముల కేటాయింపు రద్దు
AP: తిరుమలలోని గోగర్భం డ్యామ్ సమీపంలో శారదా పీఠానికి భూకేటాయింపును రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని టీటీడీకి దేవదాయశాఖ ఆదేశాలు జారీ చేసింది. గతేడాది డిసెంబర్ 26న శారదా పీఠానికి అప్పటి టీటీడీ బోర్డు గోగర్భం వద్ద భూమి కేటాయించింది. ఆ భూ కేటాయింపుపై నివేదిక ఇవ్వాలని టీటీడీని కోరింది.
News October 24, 2024
తదుపరి సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియామకం
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన నియామకానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. నవంబర్ 11న జస్టిస్ ఖన్నా సీజేఐగా ప్రమాణం చేస్తారు. జస్టిస్ ఖన్నా పేరును ప్రస్తుత సీజేఐ డీవై చంద్రచూడ్ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. నవంబర్ 10న జస్టిస్ చంద్రచూడ్ పదవీ విరమణ చేయనున్నారు.