News October 24, 2024
జగన్ నాకు షేర్లు బదిలీ చేయలేదు: షర్మిల

AP: జగన్ తనకు షేర్లు బదిలీ చేశారనేది పచ్చి అబద్ధమని షర్మిల మండిపడ్డారు. ‘ఆస్తులపై ప్రేమతో కుటుంబ విషయాలను రోడ్డు మీదకు తెచ్చారు. సరస్వతి కంపెనీ షేర్లను ఈడీ అటాచ్ చేయలేదు. వాటిని బదిలీ చేసుకోవచ్చు. షేర్లు బదిలీ చేస్తే బెయిల్ రద్దవుతుందని జగన్ వాదిస్తున్నారు. 2019లో వంద శాతం వాటాలు బదలాయిస్తానని ఎంవోయూపై సంతకం ఎలా చేశారు? అప్పుడు మీ బెయిల్ సంగతి గుర్తుకు రాలేదా?’ అని ప్రశ్నించారు.
Similar News
News July 9, 2025
నిమిష మరణ శిక్ష రద్దుకు చివరి మార్గమిదే..

హత్య కేసులో కేరళ నర్సు <<16996463>>నిమిషకు<<>> యెమెన్ ఈనెల 16న మరణశిక్ష అమలు చేయనుంది. ఆమెకు శిక్ష తప్పాలంటే మృతుడి కుటుంబసభ్యులు క్షమాభిక్ష పెట్టడమే చివరి మార్గం. ఇందుకు 2020 నుంచి మానవ హక్కుల యాక్టివిస్ట్ జెరోమ్ ప్రయత్నిస్తున్నారు. వారికి $1 మిలియన్ పరిహారం, మృతుడి సోదరుడికి UAE లేదా సౌదీలో శాశ్వత నివాసం వంటి ఆఫర్లిచ్చారు. భారత ప్రభుత్వం సహకరిస్తోందని, లేదంటే ఇప్పటికే మరణశిక్ష అమలయ్యేదని జెరోమ్ తెలిపారు.
News July 9, 2025
ఆరు బయట చెత్తను వేస్తే.. పరువు పోవడం పక్కా!

బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయొద్దనే ఉద్దేశంతో మున్సిపాలిటీలు ఇంటింటికీ వెళ్లి చెత్తను కలెక్ట్ చేస్తుంటాయి. అయినప్పటికీ కొందరు బయటే చెత్త వేసి ఇతరులను ఇబ్బంది కలగజేస్తుంటారు. అలాంటివారికి బుద్ధి చెప్పాలని గుజరాత్లోని వడోదరా మున్సిపాలిటీ అధికారులు వినూత్నంగా ఆలోచించారు. రోడ్డు పక్కన చెత్త వేసేవారి ఫొటోలను తీసి పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఇలా అయినా ప్రజలకు ఈ అలవాటును మార్చుకుంటారో లేదో చూడాల్సి ఉంది.
News July 9, 2025
రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ జరగనుందా?

AP: YCP దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంలో వెనకబడితే కొత్త మంత్రులు వస్తారని CM CBN ఇవాళ <<17007606>>వార్నింగ్<<>> ఇచ్చారు. దీంతో మంత్రివర్గ విస్తరణపై మరోసారి చర్చ మొదలైంది. నాగబాబుకు MLC పదవి దక్కిన తొలినాళ్లలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం జరిగింది. ఉగాది తర్వాత ఆయన్ను క్యాబినెట్లోకి తీసుకుంటారని భావించినా అలా జరగలేదు. తాజాగా CM చేసిన వ్యాఖ్యలతో మంత్రి పదవి కోరుకుంటున్న వారిలో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి.