News October 24, 2024

అమెరికా, చైనా.. రెండూ భారత్‌ను విస్మరించలేవు: నిర్మల

image

భారత్ లక్ష్యం ప్రపంచాన్ని ప్రభావితం చేయడమే కానీ ఆధిపత్యం చెలాయించడం కాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. నేడు భారత్ ఉన్న స్థాయిని అటు US, ఇటు చైనా రెండూ విస్మరించలేవని గుర్తుచేశారు. ‘మనది అతి పెద్ద ప్రజాస్వామ్యం. అతి పెద్ద జనాభా కలిగిన దేశం. భూమ్మీద ఉన్న ప్రతి ఆరుగురిలో ఒకరు భారతీయుడే. మన ఆర్థిక వ్యవస్థను పట్టించుకోకుండా ఉండటం ఎవరికైనా అసాధ్యం’ అని స్పష్టం చేశారు.

Similar News

News October 24, 2024

‘పింక్ ఆటోలు’.. ఆలోచన బాగుంది కదా!

image

మహిళల భద్రత, స్వయం ఉపాధి కోసం తమిళనాడు ప్రభుత్వం ‘పింక్ ఆటోరిక్షాల’ స్కీం తీసుకొచ్చింది. CNG లేదా హైబ్రిడ్ ఆటోలు కొనుగోలు చేసేందుకు 250 మంది ఒంటరి, నిరుపేద మహిళలకు రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తుంది. మిగతా మొత్తం తక్కువ వడ్డీకి లోన్ రూపంలో అందిస్తుంది. అందులో జీపీఎస్ ఉండటం వల్ల డ్రైవర్లకు, ప్రయాణికులకు భద్రత ఉంటుంది. ఇతర రాష్ట్రాల్లోనూ ఈ పథకం తీసుకొస్తే బాగుంటుంది కదూ..!

News October 24, 2024

‘పుష్ప-2’కు బన్నీకి రెమ్యూనరేషన్ ఎన్ని కోట్లంటే?

image

పుష్ప-2 కు అల్లు అర్జున్ భారీ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. రూ.100 కోట్లు తీసుకున్నారని కొన్ని కథనాలు పేర్కొన్నాయి. అయితే మూడేళ్ల కాలాన్ని ఈ సినిమాకే వెచ్చించడంతో రూ.200 కోట్లకుపైగా తీసుకుంటారని మరికొన్ని తెలిపాయి. లేదంటే సినిమా కలెక్షన్లలో 27శాతం ప్రాఫిట్ తీసుకునేలా ఒప్పందం చేసుకున్నారని సమాచారం. కాగా ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్లలో విడుదల కానుంది.

News October 24, 2024

Meta, X స‌హ‌కారం కోరిన కేంద్ర ప్ర‌భుత్వం

image

విమానాలకు న‌కిలీ బాంబు బెదిరింపులు అధిక‌మ‌వ్వ‌డంతో వీటి క‌ట్ట‌డిలో స‌హ‌క‌రించాలని X, Meta సంస్థ‌ల‌ను కేంద్రం కోరింది. ఈ వేదిక‌ల మీద వ‌స్తున్న బెదిరింపు కాల్స్‌, సందేశాల వెనుక ఉన్న‌వారిని గుర్తించేందుకు అవ‌స‌ర‌మైన డేటాను త‌మ‌తో పంచుకోవాల‌ని కోరింది. దేశ ప్ర‌జ‌ల శ్రేయ‌స్సుతో ముడిప‌డిన అంశం కారణంగా 2 సంస్థ‌లు స‌హ‌క‌రించాల్సి ఉంద‌ని ఓ అధికారి తెలిపారు. 9 రోజుల్లో 170 విమానాలకు బెదిరింపులు వచ్చాయి.