News October 24, 2024
‘బాలయ్య పండుగ’.. రేపు సెలవివ్వాలని ప్లకార్డుల ప్రదర్శన
సీనియర్ హీరో బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తోన్న ‘అన్స్టాపబుల్ షో’ సీజన్ 4 రేపటి నుంచి ప్రసారం కానుంది. ఈ కార్యక్రమానికి గెస్ట్గా ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ క్రమంలో రేపు సెలవు ఇవ్వాలని ఐటీ ఉద్యోగులు ప్లకార్డులు ప్రదర్శించారు. అక్టోబర్ 25ను బాలయ్య పండుగగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరలవుతున్నాయి.
Similar News
News October 25, 2024
పగలు జాబ్.. రాత్రి ఫ్రీ కోచింగ్.. హ్యాట్సాఫ్ సర్!
నిస్వార్థంగా సాయం చేసేవారు చాలా అరుదు. హరియాణాలోని బహదుర్గఢ్కు చెందిన కానిస్టేబుల్ అజయ్ గ్రేవల్ అదే కోవకు చెందుతారు. ఢిల్లీ పోలీసు శిక్షణ కాలేజీలో పనిచేస్తున్న ఆయన ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు తన ఇంటిపైనే రాత్రుళ్లు ఉచిత కోచింగ్ ఇస్తున్నారు. ఆయన శిక్షణలో 3వేలమందికిపైగా ఉద్యోగాలు సాధించారు. రోజుకు 5 గంటలే నిద్రపోయినా, డబ్బు కంటే విలువైన ఆత్మసంతృప్తిని పొందుతున్నానంటున్నారాయన. హ్యాట్సాఫ్ సర్.
News October 25, 2024
మొబైల్ ఫోన్ త్వరగా ఛార్జ్ కావాలంటే?
ఆధునిక ప్రపంచంలో మొబైల్ మన జీవితంలో ఓ భాగమైంది. అలాంటి మొబైల్ త్వరగా ఛార్జ్ అవ్వాలంటే కొన్ని ట్రిక్స్ పాటిస్తే చాలు. అవేంటంటే.. ఛార్జింగ్లో ఉన్నప్పుడు మొబైల్ను షేక్ చేయొద్దు. ఛార్జ్ చేసే ముందు రన్నింగ్ యాప్స్, ఇంటర్నెట్ ఆఫ్ చేయాలి. 40శాతం కన్నా తక్కువ ఛార్జింగ్ ఉన్నప్పుడే ఛార్జ్ చేయడం ఉత్తమం. బ్రైట్నెస్ తగ్గించుకొని ఉపయోగించుకోవాలి. స్విచాఫ్ చేసి ఛార్జ్ చేస్తే త్వరగా ఎక్కుతుంది.
News October 25, 2024
IPL తొలి రిటెన్షన్ సంజూ శాంసన్?
ఐపీఎల్ 2025 కోసం సంజూ శాంసన్ను రాజస్థాన్ రాయల్స్ రిటైన్ చేసుకున్నట్లు క్రిక్ట్రాకర్ తెలిపింది. సంజూకు రిటెన్షన్ కింద రూ.18 కోట్లు ఇవ్వనున్నట్లు సమాచారం. మిగతా ఆటగాళ్ల రిటెన్షన్లపై తీవ్ర కసరత్తు చేస్తోంది. యశస్వీ జైస్వాల్, రియాన్ పరాగ్, యుజ్వేంద్ర చాహల్ను అట్టిపెట్టుకోవాలని భావిస్తున్నట్లు టాక్. ఇక జోస్ బట్లర్, ట్రెంట్ బౌల్ట్లలో ఒకరిని రిటైన్ చేసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.