News October 24, 2024

ప్రధాని మోదీని కలిసిన ఒమర్ అబ్దుల్లా

image

జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రధాని మోదీతో ఢిల్లీలో భేటీ అయ్యారు. J&Kకు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని J&K క్యాబినెట్ చేసిన తీర్మాన పత్రాన్ని ప్రధానికి అందజేశారు. అంతకుముందు అబ్దుల్లా.. కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, రాజ్‌నాథ్ సింగ్‌లను కలిశారు. J&Kలో రహదారుల అనుసంధానాన్ని పెంచాలని కోరారు.

Similar News

News October 25, 2024

తిరుమల హోటళ్లకు బాంబు బెదిరింపులు

image

AP: తిరుమలలోని నాలుగు హోటళ్లను పేల్చేస్తామని బెదిరింపు మెయిల్ వచ్చింది. అప్రమత్తమైన పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. అనంతరం తిరుపతి, అలిపిరి పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు చేశారు. మరోవైపు ఇవాళ ఏకంగా 70కిపైగా విమానాలకు బాంబు బెదిరింపులు రావడం కూడా కలకలం రేపింది. వీటిలో ఎయిర్ ఇండియా, విస్తారా, ఇండిగో విమానాలు ఉన్నాయి.

News October 25, 2024

పగలు జాబ్.. రాత్రి ఫ్రీ కోచింగ్.. హ్యాట్సాఫ్ సర్!

image

నిస్వార్థంగా సాయం చేసేవారు చాలా అరుదు. హరియాణాలోని బహదుర్గఢ్‌కు చెందిన కానిస్టేబుల్ అజయ్ గ్రేవల్ అదే కోవకు చెందుతారు. ఢిల్లీ పోలీసు శిక్షణ కాలేజీలో పనిచేస్తున్న ఆయన ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు తన ఇంటిపైనే రాత్రుళ్లు ఉచిత కోచింగ్ ఇస్తున్నారు. ఆయన శిక్షణలో 3వేలమందికిపైగా ఉద్యోగాలు సాధించారు. రోజుకు 5 గంటలే నిద్రపోయినా, డబ్బు కంటే విలువైన ఆత్మసంతృప్తిని పొందుతున్నానంటున్నారాయన. హ్యాట్సాఫ్ సర్.

News October 25, 2024

మొబైల్ ఫోన్ త్వరగా ఛార్జ్ కావాలంటే?

image

ఆధునిక ప్రపంచంలో మొబైల్ మన జీవితంలో ఓ భాగమైంది. అలాంటి మొబైల్ త్వరగా ఛార్జ్ అవ్వాలంటే కొన్ని ట్రిక్స్ పాటిస్తే చాలు. అవేంటంటే.. ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు మొబైల్‌ను షేక్ చేయొద్దు. ఛార్జ్ చేసే ముందు రన్నింగ్ యాప్స్, ఇంటర్నెట్ ఆఫ్ చేయాలి. 40శాతం కన్నా తక్కువ ఛార్జింగ్ ఉన్నప్పుడే ఛార్జ్ చేయడం ఉత్తమం. బ్రైట్‌నెస్ తగ్గించుకొని ఉపయోగించుకోవాలి. స్విచాఫ్ చేసి ఛార్జ్ చేస్తే త్వరగా ఎక్కుతుంది.