News October 25, 2024

నవంబర్ 1న కరీంనగర్‌కు బీసీ కమిషన్: జగిత్యాల కలెక్టర్

image

నవంబర్ 1న కరీంనగర్‌కు తెలంగాణ బీసీ కమిషన్ బృందం వస్తుందని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన రిజర్వేషన్ల దామాషాను పేర్కొనే విషయంలో ఆసక్తి కలిగిన ఆయా రాజకీయ పార్టీలు, సంఘాలు, ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు బీసీ కమిషన్ ప్రతినిధుల బృందం వస్తుందన్నారు. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి అభిప్రాయాలను నేరుగా తెలుపవచ్చన్నారు.

Similar News

News January 8, 2026

KNR: తెలంగాణ జాగృతి అధ్యయన కమిటీలో హరిప్రసాద్‌

image

తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీల అధ్యయన కమిటీ సభ్యుడిగా కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ నియమితులయ్యారు. నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావ క్రమంలో వివిధ పార్టీల పనితీరును విశ్లేషించేందుకు జాగృతి అధ్యక్షురాలు కవిత ఈ కమిటీని ఏర్పాటు చేశారు. కవితకు అత్యంత విధేయుడైన హరిప్రసాద్‌కు రాష్ట్ర స్థాయి కమిటీలో చోటు దక్కడంపై జిల్లా నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.

News January 8, 2026

కరీంనగర్: మితిమీరిన వేగం ప్రాణాంతకం: డీటీసీ

image

జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా నుస్తులాపూర్ వద్ద రవాణా, ట్రాఫిక్ పోలీసులు ఉమ్మడిగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వాహనాలు మితిమీరిన వేగంతో నడపడం ప్రాణాంతకమని డీటీసీ పురుషోత్తం పేర్కొన్నారు. ఎస్‌హెచ్-1 రహదారిపై తనిఖీలు చేపట్టి, నిబంధనలు ఉల్లంఘించిన 10 వాహనాలకు జరిమానా విధించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ వేగ నియంత్రణ పాటించాలని సూచించారు.

News January 8, 2026

కొత్తపల్లి: అక్రమ ఇసుక రవాణాపై వేటు: కలెక్టర్

image

ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హెచ్చరించారు. బుధవారం సీపీ గౌస్ ఆలం తో కలిసి తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి ఇసుక క్వారీని ఆమె తనిఖీ చేశారు. ఎల్‌ఎండీ రిజర్వాయర్ పూడికతీత, ఇసుక వేరు చేసే ప్రక్రియను పరిశీలించి, రికార్డులను తనిఖీ చేశారు. పరిమితికి మించి లోడింగ్ చేసిన, అనధికార వాహనాలు వినియోగించినా ఉపేక్షించబోమన్నారు.