News October 25, 2024
ఇళ్లు కూల్చడం దేనికి? ఆ పనులు చేయండి చాలు: ఈటల
TG: మూసీ ప్రక్షాళన విషయంలో ప్రభుత్వం ఇష్టానుసారం వ్యవహరిస్తోందని బీజేపీ నేత ఈటల రాజేందర్ మండిపడ్డారు. ‘అసలు DPR లేకుండా మార్కింగ్ ఎలా చేస్తారు. చెరువులు శుభ్రం చేసి, డ్రైనేజీ నీరు మూసీలో కలవకుండా చూడండి. అంతేకానీ పేదల ఇళ్లు కూల్చడం దేనికి? గత ప్రభుత్వం సచివాలయాన్ని బఫర్ జోన్లో కట్టలేదా? పేదల ఉసురు మంచిదికాదు. కూల్చివేతలకు ఉపక్రమిస్తే బుల్డోజర్లకు అడ్డంగా పడుకుంటాం’ అని హెచ్చరించారు.
Similar News
News October 25, 2024
21 మంది డీఈవోల బదిలీ
AP: రాష్ట్రంలోని 21 జిల్లాల విద్యాశాఖ అధికారుల(DEO)ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ట్రాన్స్ఫర్ అయిన వారిలో ఏడుగురు డీఈవోలను పాఠశాల విద్య డైరెక్టరేట్లో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
News October 25, 2024
ఆధార్ కార్డుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
వయసు నిర్ధారణకు ఆధార్ కార్డ్ చెల్లదని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. స్కూల్ సర్టిఫికెట్లను ప్రమాణికంగా తీసుకోవాలని స్పష్టం చేసింది. వయసు నిర్ధారణకు ఆధార్ను ప్రమాణికంగా తీసుకుంటూ పంజాబ్, హరియాణా హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి తరఫు కుటుంబానికి పరిహారం నిర్ణయించేందుకు ఆధార్ను ప్రమాణికంగా తీసుకోవడంతో పరిహారం తగ్గడంపై ఆ కుటుంబం పిటిషన్ దాఖలు చేసింది.
News October 25, 2024
HYD టు యాదాద్రి.. ఇక MMTS రైలు సర్వీస్
HYD నుంచి యాదాద్రికి వెళ్లే భక్తులు ఇక MMTS సర్వీస్ను ఆస్వాదించవచ్చు. ఈమేరకు కేంద్రం నిర్ణయించిందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. ఇది యాదాద్రి వెళ్లే భక్తులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. MMTS ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.800కోట్లు ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రం సహకరించకపోయినా సెకండ్ ఫేజ్ కింద సర్వీస్ను పొడిగిస్తున్నట్లు చెప్పారు.