News October 25, 2024

పుస్తకాల బరువుతో పిల్లల్లో ఆ సమస్యలు!

image

పుస్తకాల బ్యాగుల రూపంలో పిల్లల నడుముపై భారాన్ని వేయడం దీర్ఘకాలంలో ప్రమాదకరమని ముంబై లీలావతి ఆస్పత్రి వైద్యుడు సమీర్ రూపారెల్ పేర్కొన్నారు. ‘బ్యాగుల బరువు వల్ల ప్రతి 10మందిలో 8మంది చిన్నారులకి వెన్ను సమస్యలు వస్తున్నాయి. బ్యాగుల బరువు వారి శరీర బరువులో 15శాతాన్ని మించకూడదు. అధిక బరువు వల్ల మెడ, భుజాల నొప్పులు, వెన్ను వంగిపోయే స్కోలియోసిస్ వంటి పరిస్థితులూ తలెత్తవచ్చు’ అని హెచ్చరించారు.

Similar News

News October 25, 2024

21 మంది డీఈవోల బదిలీ

image

AP: రాష్ట్రంలోని 21 జిల్లాల విద్యాశాఖ అధికారుల(DEO)ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ట్రాన్స్‌ఫర్ అయిన వారిలో ఏడుగురు డీఈవోలను పాఠశాల విద్య డైరెక్టరేట్‌లో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

News October 25, 2024

ఆధార్ కార్డుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

image

వయసు నిర్ధారణకు ఆధార్ కార్డ్ చెల్లదని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. స్కూల్ సర్టిఫికెట్లను ప్రమాణికంగా తీసుకోవాలని స్పష్టం చేసింది. వయసు నిర్ధారణకు ఆధార్‌ను ప్రమాణికంగా తీసుకుంటూ పంజాబ్, హరియాణా హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి తరఫు కుటుంబానికి పరిహారం నిర్ణయించేందుకు ఆధార్‌ను ప్రమాణికంగా తీసుకోవడంతో పరిహారం తగ్గడంపై ఆ కుటుంబం పిటిషన్ దాఖలు చేసింది.

News October 25, 2024

HYD టు యాదాద్రి.. ఇక MMTS రైలు సర్వీస్

image

HYD నుంచి యాదాద్రికి వెళ్లే భక్తులు ఇక MMTS సర్వీస్‌ను ఆస్వాదించవచ్చు. ఈమేరకు కేంద్రం నిర్ణయించిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. ఇది యాదాద్రి వెళ్లే భక్తులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. MMTS ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.800కోట్లు ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రం సహకరించకపోయినా సెకండ్ ఫేజ్ కింద సర్వీస్‌ను పొడిగిస్తున్నట్లు చెప్పారు.