News October 25, 2024
పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

TG: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పారామెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీకి పారామెడికల్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. విద్యార్థులు ఈ నెల 30వ తేదీలోపు తమ దరఖాస్తులను డీఎంహెచ్వో కార్యాలయాల్లో అందించాలని తెలిపింది. జిల్లాల వారీగా కౌన్సెలింగ్ ప్రక్రియ నవంబర్ 13లోపు పూర్తి చేస్తామని, 20వ తేదీలోగా ఎంపికైన వారి జాబితా విడుదల చేస్తామంది. పూర్తి వివరాలకు TGPMB వెబ్సైట్ను సందర్శించాలని తెలిపింది.
Similar News
News December 26, 2025
ATS విధానం అమలులోకి తేవాలి: అమిత్ షా

ఎర్రకోట సమీపంలో జరిగిన బ్లాస్ట్లో 40KGల పేలుడు పదార్థాలు ఉపయోగించినట్లు హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. 3టన్నుల పేలుడు పదార్థాలను డిటోనేట్ కాకముందే స్వాధీనం చేసుకున్నామని యాంటీ టెర్రరిజం కాన్ఫరెన్స్-2025లో తెలిపారు. పోలీసులకు అవసరమైన కామన్ ATS విధానాన్ని త్వరలో అమలులోకి తేవాలని డీజీపీలను కోరారు. అందరూ తెలుసుకోవాలి అనే విధానంతో కాకుండా అందరికీ తెలియజేయాలి అనే ప్రిన్సిపల్తో ముందుకు సాగాలన్నారు.
News December 26, 2025
మోస్ట్ సెర్చ్డ్ టాలీవుడ్ హీరోయిన్ ఎవరంటే?

ఈ ఏడాది గూగుల్ లెక్కల ప్రకారం మోస్ట్ సెర్చ్డ్ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలిసిపోయింది. తొలిస్థానం తమన్నా సొంతం చేసుకున్నారు. మూవీస్, స్పెషల్ సాంగ్స్, వెబ్ సిరీస్లతో ఆమెకు పాన్ ఇండియా లెవల్లో బజ్ వచ్చింది. ఇక రెండో స్థానంలో రష్మిక, మూడో స్థానంలో సమంత, నాలుగో స్థానంలో కియారా అద్వానీ, ఐదో స్థానంలో శ్రీలీల నిలిచారు. మరి మీరు ఎవరి కోసం సెర్చ్ చేశారో కామెంట్ చేయండి.
News December 26, 2025
రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోదీ భేటీ

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ప్రధాని నరేంద్ర మోదీ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రపతి భవన్లో ఆమెను కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. వీర్ బాల్ దివస్ సందర్భంగా పలు రంగాలలో రాణించిన, ధైర్యసాహసాలు ప్రదర్శించిన 19 మంది పిల్లలకు ఇవాళ ఉదయం ప్రధాన మంత్రి <<18676177>>రాష్ట్రీయ బాల్ పురస్కార్<<>> అవార్డులను రాష్ట్రపతి అందజేసిన సంగతి తెలిసిందే.


