News October 25, 2024

HYD టు యాదాద్రి.. ఇక MMTS రైలు సర్వీస్

image

HYD నుంచి యాదాద్రికి వెళ్లే భక్తులు ఇక MMTS సర్వీస్‌ను ఆస్వాదించవచ్చు. ఈమేరకు కేంద్రం నిర్ణయించిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. ఇది యాదాద్రి వెళ్లే భక్తులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. MMTS ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.800కోట్లు ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రం సహకరించకపోయినా సెకండ్ ఫేజ్ కింద సర్వీస్‌ను పొడిగిస్తున్నట్లు చెప్పారు.

Similar News

News October 25, 2024

ANR అవార్డ్స్-2024 వేడుకకు అమితాబ్, చిరు

image

అక్కినేని నాగేశ్వర్‌రావు శత జయంతిని ఘనంగా నిర్వహించేందుకు నాగార్జున సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే ANR అవార్డ్స్-2024 ప్రదానోత్సవ కార్యక్రమానికి ఇద్దరు మెగాస్టార్లు రానున్నారు. బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ నుంచి చిరంజీవి ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. వారిద్దరినీ ఆహ్వానించినట్లు నాగార్జున ప్రకటించారు. కార్యక్రమం ఈనెల 28న జరగనుంది. ANR నేషనల్ అవార్డు చిరు అందుకోనున్నారు.

News October 25, 2024

మరో రూ.300 కోట్ల ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లించాం: మంత్రి

image

AP: పేద ప్రజల ఆరోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ‘ఎన్టీఆర్ వైద్యసేవ (ఆరోగ్యశ్రీ) కింద నెట్‌వర్క్ ఆసుపత్రులకు మాజీ సీఎం జగన్ పెట్టిన రూ.2500కోట్ల బకాయిలలో మరో రూ.300 కోట్లు ఇవాళ చెల్లించాం. రాష్ట్రం అప్పుల నుంచి అభివృద్ధి వైపు, సంక్షోభం నుంచి సంక్షేమం దిశగా పయనిస్తోంది’ అని ట్వీట్ చేశారు.

News October 25, 2024

జగన్ ఆస్తులతో షర్మిలకు సంబంధమేంటి?: వైసీపీ

image

AP: సీఎం చంద్రబాబు డైరెక్షన్‌లో విజయమ్మను ముందుపెట్టి జగన్‌ను న్యాయపరంగా ఇబ్బంది పెట్టాలని షర్మిల కుట్ర చేస్తోందని వైసీపీ ఆరోపించింది. ‘కుటుంబ ఆస్తులన్నింటినీ YSR జీవించి ఉన్నప్పుడే పంపకాలు చేసేశారు. కానీ చెల్లి షర్మిలపై ఉన్న ప్రేమాభిమానాలతో జగన్ తాను సొంతంగా సంపాదించుకున్న ఆస్తుల్లోనూ వాటా ఇచ్చేందుకు ముందుకొచ్చారు’ అని ట్వీట్ చేసింది. ‘శాడిస్ట్ చంద్రబాబు’ అని పేర్కొంది.