News October 25, 2024
యాదృచ్ఛికం: టెస్టు రికార్డుల్లో కామన్గా 7/59
న్యూజిలాండ్తో జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత ప్లేయర్ వాషింగ్టన్ సుందర్ 7/59తో అదరగొట్టిన విషయం తెలిసిందే. అయితే నాలుగు దశాబ్దాల్లో మొత్తం నలుగురు ప్లేయర్లే ఈ ఘనత సాధించారు. 1994లో అనిల్ కుంబ్లే, 2005లో ఇర్ఫాన్ పఠాన్, 2016లో అశ్విన్, 2024లో సుందర్ 7 వికెట్లు తీశారు. ఇందులో ప్రతిఒక్కరూ 7 వికెట్లు తీసి 59 పరుగులు సమర్పించారు. భారత్ అత్యధిక టెస్టు స్కోరు కూడా 759 పరుగులే.
Similar News
News October 25, 2024
ఓటీటీలోకి వచ్చేసిన ‘స్వాగ్’
శ్రీవిష్ణు, రీతూ వర్మ, మీరా జాస్మిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘స్వాగ్’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. హసిత్ గోలి దర్శకత్వం వహించిన ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్ నిర్మించగా, వివేక్ సాగర్ సంగీతం అందించారు. అక్టోబర్ 4న థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది.
News October 25, 2024
ఢిల్లీ వాయు కాలుష్యంపై సీజేఐ ఆందోళన.. మార్నింగ్ వాక్కు గుడ్బై!
ఢిల్లీలో వాయు కాలుష్యం కారణంగా తాను మార్నింగ్ వాక్కు వెళ్లడం మానేసినట్లు సీజేఐ చంద్రచూడ్ తెలిపారు. గాలి నాణ్యత క్షీణించడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. డాక్టర్ సూచన మేరకు మార్నింగ్ వాక్కు వెళ్లట్లేదని, దీని వల్ల శ్వాసకోశ వ్యాధులకు దూరంగా ఉండొచ్చని అన్నారు. ఢిల్లీలో ఇవాళ ఉదయం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 283గా నమోదైంది. కాలుష్యం పెరగడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతోందని స్థానికులు చెబుతున్నారు.
News October 25, 2024
బెడిసికొట్టిన ప్లాన్.. భారత్ ఆలౌట్
న్యూజిలాండ్తో రెండో టెస్టులో భారత్ వేసిన ‘స్పిన్’ ప్లాన్ బెడిసికొడుతోంది. తొలి ఇన్నింగ్స్లో భారత బ్యాటర్లు కివీస్ స్పిన్నర్ల ఉచ్చులో చిక్కుకున్నారు. శాంట్నర్(7), ఫిలిప్స్(2) ధాటికి కుదేలైన భారత్ 156 రన్స్ మాత్రమే చేసి ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 103 పరుగులు వెనుకబడి ఉంది. ప్రత్యేకంగా రూపొందించిన ఈ స్పిన్ పిచ్లో భారత్ తరఫున సుందర్(7), అశ్విన్(3) వికెట్లు తీసిన విషయం తెలిసిందే.