News October 25, 2024
28 నుంచి బీఎస్సీ అగ్రికల్చర్ వెబ్ ఆప్షన్లు
AP: అగ్రిసెట్ ద్వారా బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్లో వెబ్ఆప్షన్ల నమోదు ప్రక్రియ ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు జరగనుంది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ రిజిస్ట్రార్ తెలిపారు. ఇటు బీడీఎస్ కన్వీనర్ కోటాలో సీట్లు పొందిన విద్యార్థులు ఫ్రీ ఎగ్జిట్ గడువు ఇవాళ సాయంత్రం వరకు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పొడిగించింది.
Similar News
News October 25, 2024
అందుకే ఐదేళ్లు మౌనంగా ఉన్నా: షర్మిల
AP:ఆస్తి కోసం తాను, అమ్మ అత్యాశ పడుతున్నామని YS అభిమానులు భావించవద్దని షర్మిల కోరారు. ‘ఆస్తుల విభజన ఒప్పందం ఐదేళ్లు నా చేతుల్లో ఉన్నా ఏనాడూ బయటికి చెప్పలేదు. ఒక్క ఆస్తి ఇవ్వకపోయినా, ఆర్థిక ఇబ్బందులు పడినా కుటుంబ గౌరవం కోసం బయటపెట్టలేదు. తాజాగా ఇవన్నీ బయటకు వచ్చాయంటే NCLTలో కేసు వేసి సొంత అమ్మకే బతుకుపై అసహ్యం కలిగించి, YSR అభిమానులను ఎనలేని క్షోభకు గురిచేసింది ఎవరో మీకు తెలుసు’ అని పేర్కొన్నారు.
News October 25, 2024
శంషాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు కాల్
శంషాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు కాల్ రావడంతో కలకలం రేగింది. హైదరాబాద్ నుంచి చండీగఢ్ వెళుతున్న ఇండిగో విమానంలో బాంబు పెట్టినట్లు అధికారులకు ఫోన్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు ప్రయాణికులను కిందకి దించి తనిఖీలు చేస్తున్నారు. ఆ విమానంలో 130 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది.
News October 25, 2024
IPL ఫ్యాన్స్కు అదిరిపోయే న్యూస్
IPL రిటెన్షన్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు మంచి కిక్కిచ్చే న్యూస్. ఈ నెల 31వ తేదీన సాయంత్రం 4.30 గంటలకు రిటెన్షన్ షో ప్రారంభం అవుతుందని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. జియో సినిమాలో దీనికి సంబంధించి లైవ్ ప్రసారం అవుతుంది. అట్టిపెట్టుకునే ఆటగాళ్ల వివరాలను ఆయా జట్లు ఆ రోజున ప్రకటించనున్నాయి. మీ అభిమాన జట్టు ఏ ప్లేయర్ను రిటెయిన్ చేసుకుంటుందని మీరు అంచనా వేస్తున్నారో కామెంట్ చేయండి.