News October 25, 2024
అందుకే ఐదేళ్లు మౌనంగా ఉన్నా: షర్మిల
AP:ఆస్తి కోసం తాను, అమ్మ అత్యాశ పడుతున్నామని YS అభిమానులు భావించవద్దని షర్మిల కోరారు. ‘ఆస్తుల విభజన ఒప్పందం ఐదేళ్లు నా చేతుల్లో ఉన్నా ఏనాడూ బయటికి చెప్పలేదు. ఒక్క ఆస్తి ఇవ్వకపోయినా, ఆర్థిక ఇబ్బందులు పడినా కుటుంబ గౌరవం కోసం బయటపెట్టలేదు. తాజాగా ఇవన్నీ బయటకు వచ్చాయంటే NCLTలో కేసు వేసి సొంత అమ్మకే బతుకుపై అసహ్యం కలిగించి, YSR అభిమానులను ఎనలేని క్షోభకు గురిచేసింది ఎవరో మీకు తెలుసు’ అని పేర్కొన్నారు.
Similar News
News October 25, 2024
టీమ్ ఇండియాకు సరికొత్త ‘వాల్’ కావాలి
టీమ్ ఇండియాలో టాలెంటెడ్ ఆటగాళ్లకు కొదువ లేకపోయినా టెస్టుల్లో నిలదొక్కుకొని ఆడే ప్లేయర్ కొరత కొంత కాలంగా వేధిస్తోంది. ‘ది వాల్’ ద్రవిడ్ తర్వాత ఆయన స్థానాన్ని కొంత మేర పుజారా భర్తీ చేశారు. అయితే ఆయన ఫామ్ లేమితో జట్టుకు దూరమవ్వగా ఇప్పుడు ఆ ప్లేస్లో కొరత ఉందని క్రీడా నిపుణులు చెబుతున్నారు. మరి ఇప్పటికైనా జట్టు యాజమాన్యం ఆ స్థానాన్ని భర్తీ చేసే ప్లేయర్ను అన్వేషిస్తుందా లేదా వేచి చూడాలి.
News October 25, 2024
BREAKING: పోలీసు శాఖ కీలక నిర్ణయం
TG: రాష్ట్రంలో బెటాలియన్ కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యుల ఆందోళనలతో పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సెలవుల విధానంపై ఇటీవల ఇచ్చిన ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేసింది. మరోవైపు ఐదేళ్లు ఒకే చోట పోస్టింగ్, ఒకే రాష్ట్రం-ఒకే పోలీసింగ్ విధానం తీసుకురావాలని కానిస్టేబుళ్ల కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి.
News October 25, 2024
ముద్ర రుణాల పరిమితి పెంపు
ముద్ర రుణాల పరిమితిని కేంద్రం రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచింది. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని చెప్పింది. సూక్ష్మ, చిన్న తరహా సంస్థల కోసం కేంద్రం ఈ స్కీమ్ను తీసుకొచ్చింది. ఇప్పటివరకు 3 రకాలుగా రూ.50వేలు, రూ.50వేలు నుంచి రూ.5లక్షలు, రూ.5-10లక్షలు లోన్స్ అందించింది. తాజాగా రూ.10-20 లక్షల రుణాన్ని తీసుకొచ్చింది. ప్రభుత్వ బ్యాంకుల్లో 9.15-12.80 వడ్డీతో పొందొచ్చు.