News October 25, 2024

అనకాపల్లి: ‘పగలు రాత్రి గస్తీ నిర్వహించాలి’

image

దొంగతనాలు జరగకుండా పగలు రాత్రి గస్తీ నిర్వహించాలని పోలీస్ అధికారులను అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా ఆదేశించారు. శుక్రవారం పోలీస్ కార్యాలయంలో సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. పరవాడలో జరిగిన ఏటీఎం దొంగతనం కేసులో నిందితులు వాడినట్లు అనుమానిస్తున్న వాహనం లాంటిదే కేరళ రాష్ట్రం త్రిశూల్‌లో ఇదే రకమైన కేసులో పట్టుబడిందని అన్నారు. పీటీ వారెంట్ పై నిందితులను తీసుకొస్తామన్నారు.

Similar News

News December 31, 2025

విశాఖ: 8 ఏళ్ల బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలు శిక్ష

image

విశాఖలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి స్పెషల్ పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. భోగాపురం ప్రాంతానికి చెందిన నర్సింగ్ వన్‌టౌన్ పరిధిలో ఉంటున్నాడు. ఈ ఏడాది మార్చిలో అదే ప్రాంతంలో ఉంటున్న 8 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించింది. నేరం రుజువు కావడంతో కోర్టు పైవిధంగా శిక్షను విధిస్తూ మంగళవారం తీర్పు నిచ్చింది.

News December 31, 2025

విశాఖ: రేషన్ షాపుల్లో రూ.20కే కిలో గోధుమ పిండి!

image

జిల్లాలోని పట్టణ ప్రాంత రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. మారుతున్న ప్రజల ఆహారపు అలవాట్లు, ఆరోగ్యం దృష్ట్యా జనవరి 2, 2026 నుంచి కార్డుకు కిలో చొప్పున గోధుమ పిండిని కేవలం రూ.20లకే పంపిణీ చేయనున్నారు. బహిరంగ మార్కెట్లో రూ.45 నుంచి రూ.80 వరకు ఉన్న పిండిని సబ్సిడీ ధరకే అందిస్తున్నారు. పోషకాలతో కూడిన ఈ గోధుమ పిండిని లబ్ధిదారులందరూ వినియోగించుకోవాలని జాయింట్ కలెక్టర్ కోరారు.

News December 31, 2025

విశాఖ: రేషన్ షాపుల్లో రూ.20కే కిలో గోధుమ పిండి!

image

జిల్లాలోని పట్టణ ప్రాంత రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. మారుతున్న ప్రజల ఆహారపు అలవాట్లు, ఆరోగ్యం దృష్ట్యా జనవరి 2, 2026 నుంచి కార్డుకు కిలో చొప్పున గోధుమ పిండిని కేవలం రూ.20లకే పంపిణీ చేయనున్నారు. బహిరంగ మార్కెట్లో రూ.45 నుంచి రూ.80 వరకు ఉన్న పిండిని సబ్సిడీ ధరకే అందిస్తున్నారు. పోషకాలతో కూడిన ఈ గోధుమ పిండిని లబ్ధిదారులందరూ వినియోగించుకోవాలని జాయింట్ కలెక్టర్ కోరారు.