News October 25, 2024

అనుభవం నుంచి వచ్చిన ఆలోచనతో..!

image

దీపావళికి సొంతూరుకు వెళ్లేందుకు బస్సు టికెట్ లభించకపోవడంతో ఇబ్బంది పడిన ఓ యువకుడికి వచ్చిన ఆలోచన రూ.వేల కోట్లకు అధిపతిని చేసింది. నిజామాబాద్‌కు చెందిన ఫణీంద్ర సామ అనే వ్యక్తి బస్ స్టాండ్‌కి వెళ్లగా సీటు లభించకపోవడంతో ఆగిపోయాడు. దీంతో ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకునే సదుపాయం ఉంటే ఎందరికో ఉపయోగపడుతుందని భావించి RedBusను స్టార్ట్ చేశారు. తొలుత ఇబ్బందులు ఏర్పడినా ఎదుర్కొని ముందుకెళ్లి విజయం సాధించారు.

Similar News

News January 1, 2026

X మొత్తం ఇదే.. ఇలా చేయడం నేరమే!

image

కొందరు X వేదికగా అమ్మాయిలు, సెలబ్రిటీల ఫొటోలను షేర్ చేస్తూ వారిని అసభ్యంగా (బికినీలో) చూపించాలని AI టూల్ ‘గ్రోక్’ను కోరుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అది మెషీన్ కావడంతో అభ్యంతరకర ఫొటోలు సైతం ఎడిట్ చేసి ఇస్తోంది. అయితే ఇలా చేయడం ఇతరుల వ్యక్తిగత గోప్యతను దెబ్బతీయడమే. అనుమతి లేకుండా ఫొటోలను మార్ఫింగ్ చేయడం సైబర్ క్రైమ్ లాంటిదే. జైలు శిక్ష కూడా పడే ఛాన్స్ ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

News January 1, 2026

నిమ్మలో కొమ్మల కత్తిరింపు వల్ల లాభమేంటి?

image

అంటు కొమ్మలను నాటిన నిమ్మ మొక్కల వేరు మూలం నుంచి పెరిగే కొమ్మలను ఎప్పటికప్పుడు కత్తిరించాలి. కాండంపై 2 అడుగుల ఎత్తువరకు పక్క కొమ్మలు పెరగకుండా తీసేయాలి. చెట్టుకు ఉన్న అనవసర, ఎండు, తెగులు సోకిన కొమ్మ భాగాలను కత్తిరించి తీసేయాలి. కొమ్మ కత్తిరింపుల తర్వాత చెట్టుపై 1% బోర్డో మిశ్రమం లేదా కాపర్ఆక్సీక్లోరైడ్‌ను చెట్టుపై పిచికారీ చేయాలి. చెట్టు మొదలు నుంచి 1.5 అడుగుల ఎత్తు వరకు బోర్డో పేస్టును పూయాలి.

News January 1, 2026

బంగ్లాలో మరో హిందువుపై దాడి.. సజీవ దహనానికి యత్నం

image

బంగ్లాలో మైనారిటీలపై దాడులు ఆగడం లేదు. తాజాగా షరియత్‌పూర్ జిల్లాలో ఖోకన్ దాస్ అనే హిందువుపై ఒక గుంపు దారుణంగా దాడి చేసింది. డిసెంబర్ 31న ఇంటికి వెళ్తున్న అతడిపై కత్తులతో అటాక్ చేసి తీవ్రంగా కొట్టి ఆపై నిప్పు పెట్టారు. దగ్గర్లో ఉన్న చెరువులోకి దూకి అతడు ప్రాణాలు కాపాడుకున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అమృత్ మండల్, దీపూ దాస్ వంటి వారూ ఇలాంటి దాడుల్లోనే ప్రాణాలు కోల్పోయారు.