News October 25, 2024
అప్పుడు క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డ జీషన్ సిద్ధిఖీ

మహారాష్ట్రలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచిన మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ కుమారుడు జీషన్ సిద్ధిఖీ జులైలో జరిగిన MLC ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారు. దీంతో విపక్ష MVA కూటమి అభ్యర్థి ఓడిపోవడంతో కాంగ్రెస్ జీషన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ముందు నుంచి NCP అజిత్ పవార్ వర్గంతో టచ్లో ఉన్న జీషన్ ఎన్నికల ముందు ఊహించినట్టుగానే ఆ పార్టీలో చేరి టికెట్ పొందారు.
Similar News
News January 10, 2026
చిన్నస్వామి స్టేడియంలో RCB మ్యాచ్లు లేనట్టే?

బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో 2026 IPL మ్యాచ్ల నిర్వహణపై క్లారిటీ రావడం లేదు. ఇక్కడ మ్యాచ్ల గురించి RCB ఇప్పటివరకు KSCAతో చర్చించలేదు. కోహ్లీతోపాటు ఇతర ప్లేయర్ల భద్రత దృష్ట్యా గత ఏడాది ఈ గ్రౌండ్లో జరగాల్సిన డొమెస్టిక్ మ్యాచ్లను రాయ్పూర్కు తరలించారు. 2025 ట్రోఫీ <<16602800>>సెలబ్రేషన్స్లో జరిగిన తొక్కిసలాటలో<<>> 11 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ స్టేడియంలో RCB మ్యాచ్లు ఆడే అవకాశం లేనట్టే.
News January 9, 2026
వెనిజులాపై మరో దాడి అక్కర్లేదు: ట్రంప్

వెనిజులాలో పొలిటికల్ ప్రిజనర్స్ను విడుదల చేయడాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వాగతించారు. ‘వాళ్లు శాంతిని కాంక్షిస్తున్నారన్న విషయం అర్థమవుతోంది. ఆయిల్, గ్యాస్ స్ట్రక్చర్ను రీబిల్ట్ చేయడంలో US, వెనిజులా కలిసి పనిచేస్తున్నాయి. ఈ సహకారం వల్లే నేను గతంలో ప్లాన్ చేసిన రెండో దఫా దాడులను రద్దు చేశాను. దాని అవసరం రాదు. కానీ రక్షణ కోసం అన్ని నౌకలు అక్కడే ఉంటాయి’ అని తెలిపారు.
News January 9, 2026
బొగ్గు స్కాంలో అమిత్ షా.. నా దగ్గర పెన్ డ్రైవ్లు ఉన్నాయి: మమత

బొగ్గు కుంభకోణం ద్వారా వచ్చే ఆదాయం మొత్తం కేంద్ర మంత్రి అమిత్ షాకే వెళ్తుందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. తన ప్రభుత్వంపై స్థాయికి మించి ఒత్తిడి చేస్తే అన్నింటినీ బయటపెడతానని హెచ్చరించారు. ‘కోల్ స్కాంలో షా ప్రమేయం ఉంది. నా దగ్గర పెన్ డ్రైవ్లు ఉన్నాయి. సీఎం కుర్చీపై ఉన్న గౌరవంతో మౌనంగా ఉన్నా. నేను వివరాలు బయటపెడితే దేశం షేక్ అవుతుంది. ఒక పాయింట్ వరకే దేన్నైనా సహిస్తా’ అని హెచ్చరించారు.


