News October 25, 2024

తిరుమల: వృద్ధులకు టీటీడీ కీలక సూచనలు

image

ఇటీవల తిరుమల నడక మార్గంలో గుండె సంబంధిత కేసులు ఎక్కువగా నమోదు అవుతుండటంతో 60 ఏళ్లు దాటిన భక్తులకు టీటీడీ సూచనలు చేసింది. బీపీ, ఉబ్బసం, మూర్చ, కీళ్ల వ్యాధులు ఉన్న వ్యక్తులు నడక మార్గాన రావడం మంచిది కాదని తెలిపింది. సముద్రమట్టానికి అధిక ఎత్తులో ఉండడంతో ఆక్సిజన్ స్థాయిలు తక్కువ ఉంటాయని చెప్పింది. సమస్యలు ఎదురైతే 1500 మెట్లు, గాలిగోపురం, భాష్యకార్ల సన్నిధి వద్ద వైద్య సేవలు పొందవచ్చని వెల్లడించింది.

Similar News

News March 3, 2026

చిత్తూరు: నిరుపయోగంగా నీటి తొట్టెలు

image

వేసవిలో పశువుల దాహార్తిని తీర్చేందుకు జిల్లా వ్యాప్తంగా నీటి తొట్టెలను ఉపాధి హామీ పథకంలో నిర్మించారు. జిల్లాలో రూ. 2.71 కోట్ల వ్యయంతో 776 నీటి తొట్టెలను నిర్మించారు. వీటి నిర్వహణను పట్టించుకోకపోవడంతో నిరుపయోగంగా మారుతున్నాయి. అధికారులు వీటిలో నీటిని నింపేలా చర్యలు చేపడితే.. వేసవిలో పశువులకు నీటి కొరత ఉండదని పాడి రైతులు తెలుపుతున్నారు.

News March 3, 2026

TPT: 30 ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

TTD ఆధ్వర్యంలోని బర్డ్ (BIRRD) హాస్పిటల్ నందు కాంట్రాక్ట్ ప్రాతిపదికగా వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు TTD ప్రకటనలో పేర్కొంది. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, మెడికల్ ఆఫీసర్ మొదలైన 9 విభాగాలలో మొత్తం 30 ఖాళీలు ఉన్నట్లు తెలియజేశారు. అర్హత, ఇతర వివరాలకు https://www.tirumala.org/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 13.

News March 3, 2026

చిత్తూరు: ప్రియురాలిపై అనుమానంతో సూసైడ్

image

ప్రియురాలిపై అనుమానంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కార్వేటినగరంలో జరిగింది. పద్మ సరస్సు ఎస్టీ కాలనీకి చెందిన చంద్రశేఖర్ (35) ఓ మహిళతో సాన్నిహిత్యంగా ఉంటున్నాడు. ఆ మహిళపై అనుమానంతో కొందుగాని మిట్ట వద్ద ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.