News October 25, 2024

తిరుమల నడక దారిన వెళ్లే వారికి TTD కీలక సూచనలు

image

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు మెట్ల మార్గంలో వెళ్తున్న భక్తులకు టీటీడీ కీలక సూచనలు చేసింది. 60 ఏళ్లు దాటిన వృద్ధులు, షుగర్, హై BP, గుండె సంబంధిత వ్యాధులు, ఉబ్బసం వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు నడక దారిన రావడం మంచిది కాదని తెలిపింది. తిరుమల కొండ చాలా ఎత్తులో ఉండటంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తిరుమలలో 24 గంటలూ వైద్య సదుపాయం అందుబాటులో ఉంటుందని, భక్తులు సహకరించాలని కోరింది.

Similar News

News March 18, 2025

భగవద్గీత నాకు బలాన్ని, శాంతిని ఇస్తుంది: తులసీ గబ్బార్డ్

image

భగవద్గీత తనకు ప్రశాంతతను, మనోస్థైర్యాన్ని ఇస్తుంటుందని అమెరికా నిఘా సంస్థల డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ అన్నారు. భారత పర్యటనలో ఉన్న ఆమె ANIతో ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘భారత్‌కు వస్తే సొంత ఇంటికి వచ్చినట్లుంటుంది. ప్రజలు ఎంతో సాదరంగా మాట్లాడుతారు. ఆహారం అత్యంత రుచికరంగా ఉంటుంది. నేను యుద్ధక్షేత్రంలో ఉన్న సమయంలో భగవద్గీత నాకు ఊరటనిచ్చేది’ అని వివరించారు. ఆమె హిందూమతాన్ని అనుసరిస్తున్న సంగతి తెలిసిందే.

News March 18, 2025

తెలంగాణ తదుపరి CSగా రామకృష్ణారావు?

image

TG: ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పదవీకాలం ఈ ఏప్రిల్‌తో ముగియనుంది. ఈ నేపథ్యంలో తదుపరి సీఎస్‌గా కె.రామకృష్ణారావు పేరును ప్రభుత్వం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 1980 బ్యాచ్‌కు చెందిన ఈయన ప్రస్తుతం
ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. రామకృష్ణారావు పదవీకాలం ఈ ఆగస్టుతో ముగియనుంది. ఈయన తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి 12 బడ్జెట్లను రూపొందించి రికార్డు సృష్టించారు.

News March 18, 2025

నేడు శ్రీవారి అర్జితసేవా టికెట్ల కోటా విడుదల

image

శ్రీవారి ఆర్జిత సేవకు సంబంధించి జూన్ నెల టికెట్ల లక్కీడీప్ కోటాను TTD ఈరోజు ఉదయం 10గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ నెల 20న ఉదయం 10 గంటల వరకు భక్తులు నమోదు చేసుకోవచ్చు. డిప్‌లో టికెట్లు దక్కిన భక్తులు ఈ నెల 20-22 తేదీల మధ్యలో పేమెంట్ పూర్తి చేసి టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇక 24న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, మధ్యాహ్నం గదుల కోటాను విడుదల చేయనుంది.

error: Content is protected !!