News October 25, 2024
పాపులర్ ఓటు Vs ఎలక్టోరల్ ఓటు.. ఏది ముఖ్యం? (3/3)
పాపులర్ ఓట్ల (ప్రజలు వేసే ఓట్లు) కంటే ఎలక్టోరల్ ఓట్లే కీలకం. పాపులర్ ఓట్లు ఎక్కువ సాధించినా ఎలక్టోరల్ ఓట్లలో విఫలమై పలువురు అధ్యక్ష పీఠానికి దూరమయ్యారు. 2000లో అల్గోర్ 48.4%, బుష్ 47.9% ఓట్లు సాధించారు. అయితే బుష్ 271 ఎలక్టోరల్ ఓట్లు పొందగా, అల్గోర్ 266 పొందారు. ఇక 2016లో హిల్లరీ 48.2%, ట్రంప్ 46% ఓట్లు పొందారు. అయితే 304 ఎలక్టోరల్ ఓట్లు గెలిచిన ట్రంప్ అధ్యక్షుడు అయ్యారు.
Similar News
News October 26, 2024
అత్యంత విలువైన సంస్థగా ఎన్విడియా
ప్రపంచంలోనే విలువైన సంస్థగా ఉన్న యాపిల్ను తోసిరాజని NVIDIA ఈరోజు ఆ స్థానాన్ని దక్కించుకుంది. త్వరలో AI సూపర్ కంప్యూటింగ్ చిప్స్ తీసుకురానుందన్న వార్తలతో సంస్థ షేర్ విలువ గణనీయంగా పెరిగింది. ఎన్విడియా విలువ 3.53 ట్రిలియన్ డాలర్లుగా ఉండగా, యాపిల్ విలువ 3.52 ట్రిలియన్ డాలర్ల వద్ద ఉంది. 6.6 బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు ఓపెన్ఏఐ ప్రకటించిన అనంతరం NVIDIA విలువ ఈ నెలలో 18శాతం పెరిగింది.
News October 26, 2024
ఇంకా యవ్వనంలోనే ఉన్నారా అన్నట్లుగా..!
అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలకు రావాలని మెగాస్టార్ చిరంజీవిని కింగ్ నాగార్జున ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు దిగిన ఫొటోను చూసి మెగా, అక్కినేని ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరూ ఇంకా యవ్వనంలోనే ఉన్నారా అన్నట్లుగా కనిపిస్తున్నారని కొనియాడుతున్నారు. ఇటీవల విశ్వంభర టీజర్లోనూ మెగాస్టార్ పాత సినిమాల్లోని చిరులా ఉన్నారంటూ మెగాఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
News October 26, 2024
ABHIMANYU: ఎన్నాళ్లో వేచిన ఉదయం..!
ఉత్తరాఖండ్ సీనియర్ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్ ఎట్టకేలకు టీమ్ ఇండియాలో చోటు దక్కించుకున్నారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ఆయనను సెలక్ట్ చేశారు. 29 ఏళ్ల అభిమన్యు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అదరగొట్టారు. దులీప్ ట్రోఫీలో 2, ఇరానీ కప్లో 1, రంజీలో 1 చొప్పున వరుసగా 4 సెంచరీలు బాదారు. ఓవరాల్గా 12 వేలకుపైగా రన్స్ సాధించారు. ఇందులో 37 సెంచరీలు ఉన్నాయి. గతంలో స్టాండ్బైగా ఎంపికైనా జట్టులో చోటు దక్కించుకోలేదు.