News October 25, 2024
2024 US elections: ఎలక్టోరల్ ఓట్ల గురించి (2/3)
50 Statesలో జనాభా ఆధారంగా ఎలక్టోరల్ ఓట్లు 435 ఉన్నాయి. ప్రతి రాష్ట్రానికి 2 ఎలక్టోరల్ ఓట్లు సెనెట్ ద్వారా వస్తాయి. తద్వారా మొత్తం 535 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. వాషింగ్టన్ డీసీకి 3 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. అత్యధిక ఓట్లు సాధించిన అభ్యర్థికి ఆ రాష్ట్రంలోని అన్ని ఎలక్టోరల్ ఓట్లు దక్కుతాయి (Winner-take-all). వీరు డిసెంబర్లో అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. జనవరిలో కాంగ్రెస్ ధ్రువీకరిస్తుంది.
Similar News
News October 26, 2024
అత్యంత విలువైన సంస్థగా ఎన్విడియా
ప్రపంచంలోనే విలువైన సంస్థగా ఉన్న యాపిల్ను తోసిరాజని NVIDIA ఈరోజు ఆ స్థానాన్ని దక్కించుకుంది. త్వరలో AI సూపర్ కంప్యూటింగ్ చిప్స్ తీసుకురానుందన్న వార్తలతో సంస్థ షేర్ విలువ గణనీయంగా పెరిగింది. ఎన్విడియా విలువ 3.53 ట్రిలియన్ డాలర్లుగా ఉండగా, యాపిల్ విలువ 3.52 ట్రిలియన్ డాలర్ల వద్ద ఉంది. 6.6 బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు ఓపెన్ఏఐ ప్రకటించిన అనంతరం NVIDIA విలువ ఈ నెలలో 18శాతం పెరిగింది.
News October 26, 2024
ఇంకా యవ్వనంలోనే ఉన్నారా అన్నట్లుగా..!
అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలకు రావాలని మెగాస్టార్ చిరంజీవిని కింగ్ నాగార్జున ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు దిగిన ఫొటోను చూసి మెగా, అక్కినేని ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరూ ఇంకా యవ్వనంలోనే ఉన్నారా అన్నట్లుగా కనిపిస్తున్నారని కొనియాడుతున్నారు. ఇటీవల విశ్వంభర టీజర్లోనూ మెగాస్టార్ పాత సినిమాల్లోని చిరులా ఉన్నారంటూ మెగాఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
News October 26, 2024
ABHIMANYU: ఎన్నాళ్లో వేచిన ఉదయం..!
ఉత్తరాఖండ్ సీనియర్ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్ ఎట్టకేలకు టీమ్ ఇండియాలో చోటు దక్కించుకున్నారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ఆయనను సెలక్ట్ చేశారు. 29 ఏళ్ల అభిమన్యు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అదరగొట్టారు. దులీప్ ట్రోఫీలో 2, ఇరానీ కప్లో 1, రంజీలో 1 చొప్పున వరుసగా 4 సెంచరీలు బాదారు. ఓవరాల్గా 12 వేలకుపైగా రన్స్ సాధించారు. ఇందులో 37 సెంచరీలు ఉన్నాయి. గతంలో స్టాండ్బైగా ఎంపికైనా జట్టులో చోటు దక్కించుకోలేదు.