News October 25, 2024
ఉచిత ఇసుక పాలసీ.. కీలక ఉత్తర్వులు

AP: రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ విధానాన్ని మరింత సులభతరం చేసింది. సీనరేజీ ఫీజు విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 21న జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అమల్లోకి తీసుకొచ్చింది. దీనిలో భాగంగా సీనరేజీ ఫీజు, మెరిట్ ఆన్ శాండ్, డీఎంఎఫ్ మాఫీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో స్థానికంగా ఇసుక లభ్యత, రవాణా పెరుగుతుందని తెలిపింది.
Similar News
News February 1, 2026
బాల్ పడగానే బాదేయడమే: ఇషాన్

తనకు మైలురాళ్ల కంటే జట్టు విజయమే ముఖ్యమని సెంచరీ హీరో ఇషాన్ కిషన్ తెలిపారు. నిన్న సెంచరీ అనంతరం ఆయన మాట్లాడారు. ‘అభిషేక్ మంచి స్టార్ట్ ఇచ్చారు. నేను దాన్ని కొనసాగించా. సింగిల్స్ తీసుకుంటే మంచి ఛాన్స్ మిస్ అయిందని తర్వాత బాధ పడాల్సి వస్తుంది. బాల్ మన రేంజ్లో పడగానే బాదే ఛాన్సుంటే బాదేయడమే. నా ఫోకస్ అంతా T20 ప్రపంచకప్ పైనే. అందుకు ఎక్స్ట్రా ఎఫర్ట్ అవసరం. ఫామ్ కంటిన్యూ చేయాలి’ అని చెప్పారు.
News February 1, 2026
IISER తిరుపతిలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

AP: తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ <
News February 1, 2026
మాఘ పౌర్ణమి: అద్భుత ఫలితాలనిచ్చే పుణ్యకార్యాలు

నేడు చేసే చిన్న సత్కార్యం కూడా కోటి రెట్ల ఫలితాన్నిస్తుంది. ఈరోజు గంగమ్మను, నారాయణుడిని స్మరిస్తూ పితృ తర్పణాలు వదలడం శుభప్రదం. దానధర్మాలకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. నువ్వులు, రేగి పండ్లు, అన్నదానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. అలాగే, సాయంత్రం వేళ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించడం వల్ల కష్టాలు తొలగి సంపదలు కలుగుతాయి. ఈ పవిత్ర దినాన చేసే జప, హోమాలు సర్వ పాపాలను హరించి మోక్షాన్ని ప్రసాదిస్తాయి.


