News October 26, 2024
రజినీ మూవీ కథ మార్చిన లోకేశ్?
సూపర్స్టార్ రజినీకాంత్కు జైలర్, ఇటు లోకేశ్ కనగరాజ్కి విక్రమ్, ఖైదీ వంటి హిట్స్ పడిన తర్వాత వారి కాంబోలో వస్తుండటంతో ‘కూలీ’ మూవీపై భారీ అంచనాలున్నాయి. మొదట అనుకున్న కథను ఆ ఒత్తిడి కారణంగా లోకేశ్ మార్చేశారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. విభిన్నమైన కథను అనుకున్న లోకేశ్ చివరికి మాస్ మసాలా కథకు మొగ్గుచూపారని పేర్కొన్నాయి. ఈ మూవీలో నాగార్జున, ఉపేంద్ర వంటి స్టార్స్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
Similar News
News October 26, 2024
సుందర్ను అశ్విన్ వారసుడిగా అప్పుడే చెప్పలేం: మంజ్రేకర్
భారత టెస్టు జట్టులో రవిచంద్రన్ అశ్విన్ వారసుడిగా వాషింగ్టన్ సుందర్ను అప్పుడే భావించకూడదని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు. ‘న్యూజిలాండ్ టెస్టులో సుందర్ 10 వికెట్లు తీశారు. కానీ ఇది కేవలం ఒక మ్యాచ్ మాత్రమే. అశ్విన్కు తనే వారసుడినని నిరూపించుకోవడానికి అతడు మరెన్నో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు చేయాల్సి ఉంటుంది. అశ్విన్ను భర్తీ చేయడం అంత సులువు కాదు’ అని స్పష్టం చేశారు.
News October 26, 2024
ట్విటర్లో దావూద్ ఇబ్రహీం ఫొటో.. వ్యక్తి అరెస్టు
మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ఫొటోను ట్విటర్లో అప్లోడ్ చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. యూపీలోని నోయిడాలో ఈ ఘటన జరిగింది. సెక్టార్-9కి చెందిన రిహాన్ అనే వ్యక్తి ఇబ్రహీం ఫొటోను ప్రొఫైల్ పిక్గా పెట్టుకున్నాడని ఫేజ్-1 పోలీసులు తెలిపారు. అతడిపై 196(1)(B) సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేశామని వెల్లడించారు. భారత్లో బాంబు దాడుల ద్వారా ఎంతోమంది అమాయకులు చనిపోవడం వెనుక దావూద్ సూత్రధారి.
News October 26, 2024
దేవాలయాల జోలికి వస్తే ఊరుకోం: మల్లాది
AP: హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారని వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫైర్ అయ్యారు. దేవాలయాలు జోలికి వస్తే ఊరుకోమని హెచ్చరించారు. విజయవాడలో గోశాలను కూల్చివేయడం హిందూ ధర్మానికి వ్యతిరేకం అని మండిపడ్డారు. సనాతన ధర్మాన్ని రక్షిస్తామనే వారు దీనికి సమాధానం చెప్పాలన్నారు. గతంలో పుష్కరాల సమయంలోనూ చంద్రబాబు అనేక దేవాలయాలను కూల్చివేయించారని దుయ్యబట్టారు.