News October 26, 2024

రజినీ మూవీ కథ మార్చిన లోకేశ్?

image

సూపర్‌స్టార్ రజినీకాంత్‌కు జైలర్, ఇటు లోకేశ్‌ కనగరాజ్‌కి విక్రమ్, ఖైదీ వంటి హిట్స్ పడిన తర్వాత వారి కాంబోలో వస్తుండటంతో ‘కూలీ’ మూవీపై భారీ అంచనాలున్నాయి. మొదట అనుకున్న కథను ఆ ఒత్తిడి కారణంగా లోకేశ్ మార్చేశారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. విభిన్నమైన కథను అనుకున్న లోకేశ్ చివరికి మాస్ మసాలా కథకు మొగ్గుచూపారని పేర్కొన్నాయి. ఈ మూవీలో నాగార్జున, ఉపేంద్ర వంటి స్టార్స్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

Similar News

News September 15, 2025

భారత్-పాక్ మ్యాచ్‌.. ICCకి PCB ఫిర్యాదు

image

భారత్‌, పాక్ మధ్య నిన్నటి మ్యాచ్‌లో రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ తీరును ఖండిస్తూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్(PCB) ICCకి ఫిర్యాదు చేసింది. ఆయన క్రీడాస్ఫూర్తి రూల్స్ ఉల్లంఘించారని, తక్షణమే టోర్నీ నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. దీనిపై స్పందించడంలో ఆలస్యం చేశారని తమ డైరెక్టర్ ఉస్మాన్‌ను సస్పెండ్ చేసింది. టాస్ సమయంలో IND కెప్టెన్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వొద్దని తమ కెప్టెన్‌కు రిఫరీ చెప్పారని PCB ఆరోపిస్తోంది.

News September 15, 2025

విడాకులు తీసుకున్న వారితో నాకు పెళ్లి అనేవారు: మీనా

image

తనపై గతంలో వచ్చిన వార్తలను జగపతి బాబు షోలో సీనియర్ నటి మీనా గుర్తు చేసుకున్నారు. ‘అప్పుల్లో ఉన్నామని తక్కువ రెమ్యునరేషన్ తీసుకోవాలని నిర్మాతలు అడిగేవారు. అలా తీసిన సినిమాలు హిట్ అయ్యాక నన్ను మర్చిపోయేవాళ్లు. వరుస అవకాశాలు ఉన్నప్పటికీ నేను పెళ్లి చేసుకున్నాను. 2022లో భర్తను కోల్పోయాక ఇండస్ట్రీలో ఎవరు విడాకులు తీసుకున్నా నాతో పెళ్లి అని వార్తలొచ్చేవి. అవి చూసినప్పుడు బాధేసేది’ అని చెప్పారు.

News September 15, 2025

లిక్కర్ స్కాం: మరో ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన సిట్

image

మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ ఇవాళ మరో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేశ్ నాయుడు, బాలాజీకుమార్ యాదవ్, నవీన్ కృష్ణ ప్రమేయంపై వివరాలు పొందుపరిచినట్లు తెలుస్తోంది. తాజాగా దాఖలు చేసిన రెండో అనుబంధ అభియోగపత్రంతో కలిపి ఇప్పటి వరకు సిట్ మొత్తం మూడు ఛార్జ్‌షీట్లు దాఖలు చేసినట్లయింది.