News October 26, 2024

రక్తం చిందిస్తూ పోరాడిన పాక్ క్రికెటర్

image

ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో పాకిస్థాన్ క్రికెటర్ సాజిద్ ఖాన్ పోరాటం అందరినీ ఆకట్టుకుంది. జట్టు 177/7తో కష్టాల్లో ఉన్నప్పుడు బంతి తగిలి రక్తం కారుతున్నా వన్డే తరహాలో బ్యాటింగ్ చేశారు. 48 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేశారు. అటు బౌలింగ్‌లోనూ తొలి ఇన్నింగ్స్‌లో 6, రెండో ఇన్నింగ్స్‌లో ఓ వికెట్ పడగొట్టారు. పాక్ అభిమానులు సాజిద్‌ను పోరాట యోధుడు అంటూ కొనియాడుతున్నారు.

Similar News

News October 26, 2024

స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్.. ఉత్తర్వులు జారీ

image

AP: స్వర్ణకారులకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఇటీవల దీనికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంక్షేమ, అభివృద్ధి సంస్థను ఏపీ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్-2001 కింద ఏర్పాటు చేస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఎన్నికల సమయంలో ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.

News October 26, 2024

సిద్ధిఖీ హత్యకు పాకిస్థాన్ నుంచి తుపాకులు

image

మహారాష్ట్రలో ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య కేసులో నిందితులు 4 తుపాకులు ఉపయోగించినట్లు పోలీసులు నిర్ధారించారు. వాటిని పాకిస్థాన్ నుంచి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. డ్రోన్ సాయంతో తుపాకులను సరిహద్దులు దాటించినట్లు తెలిపారు. కాగా అక్టోబర్ 12న ముంబైలో సిద్ధిఖీని గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ బృందం హత్య చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ కేసులో 14 మంది అరెస్ట్ కాగా ముగ్గురు పరారీలో ఉన్నారు.

News October 26, 2024

సుందర్‌ను అశ్విన్ వారసుడిగా అప్పుడే చెప్పలేం: మంజ్రేకర్

image

భారత టెస్టు జట్టులో రవిచంద్రన్ అశ్విన్ వారసుడిగా వాషింగ్టన్ సుందర్‌ను అప్పుడే భావించకూడదని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు. ‘న్యూజిలాండ్ టెస్టులో సుందర్ 10 వికెట్లు తీశారు. కానీ ఇది కేవలం ఒక మ్యాచ్ మాత్రమే. అశ్విన్‌కు తనే వారసుడినని నిరూపించుకోవడానికి అతడు మరెన్నో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు చేయాల్సి ఉంటుంది. అశ్విన్‌ను భర్తీ చేయడం అంత సులువు కాదు’ అని స్పష్టం చేశారు.