News October 26, 2024
సుందర్ను అశ్విన్ వారసుడిగా అప్పుడే చెప్పలేం: మంజ్రేకర్
భారత టెస్టు జట్టులో రవిచంద్రన్ అశ్విన్ వారసుడిగా వాషింగ్టన్ సుందర్ను అప్పుడే భావించకూడదని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు. ‘న్యూజిలాండ్ టెస్టులో సుందర్ 10 వికెట్లు తీశారు. కానీ ఇది కేవలం ఒక మ్యాచ్ మాత్రమే. అశ్విన్కు తనే వారసుడినని నిరూపించుకోవడానికి అతడు మరెన్నో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు చేయాల్సి ఉంటుంది. అశ్విన్ను భర్తీ చేయడం అంత సులువు కాదు’ అని స్పష్టం చేశారు.
Similar News
News October 26, 2024
అమెరికాలో లోకేశ్కు ఘన స్వాగతం
APకి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో అమెరికా వెళ్లిన మంత్రి లోకేశ్కు శాన్ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్టులో ఘన స్వాగతం లభించింది. నవంబర్ 1 వరకు అమెరికాలోనే ఉండనున్న మంత్రి రేపటి నుంచి పలు ఐటీ, స్టార్టప్ కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల వాతావరణాన్ని వారికి వివరించనున్నారు. ఈ నెల 29న లాస్ వేగాస్లో జరిగే ఐటీ సర్వీస్ సినర్జీ 9వ సదస్సుకు హాజరవుతారు.
News October 26, 2024
సోదరుడిని స్వయంగా పోలీసులకు అప్పగించిన మాజీ మంత్రి
TG: ఓ కేసులో నిందితుడిగా ఉన్న తన సోదరుడు శ్రీకాంత్ గౌడ్ను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్వయంగా పోలీసులకు అప్పగించారు. MBNR జిల్లా ఆదర్శ్నగర్లోని ప్రభుత్వ భూములు, డబుల్ బెడ్రూం ఇళ్లను తప్పుడు పత్రాలు సృష్టించి విక్రయించారని నలుగురిపై కేసు నమోదైంది. వారిలో ఉన్న శ్రీకాంత్ గౌడ్ పరారీలో ఉండగా పోలీసులు గాలింపు చేపట్టారు. ఈక్రమంలోనే నిన్న ఆయనను శ్రీనివాస్ గౌడ్ కారులో తీసుకొచ్చి PSలో అప్పగించారు.
News October 26, 2024
శంషాబాద్ టు వైజాగ్.. 4 గంటలే ప్రయాణం
శంషాబాద్ నుంచి వైజాగ్కు కేవలం 4 గంటల్లోనే చేరుకునే సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్ ఎలైన్మెంట్ ఖరారైంది. గంటకు 220KM వేగంతో దూసుకెళ్లే ఈ రైలు విజయవాడ మీదుగా వైజాగ్ చేరుకుంటుంది. ఈ రూట్లో మొత్తం 12 స్టేషన్లుంటాయి. సర్వే తుది దశకు చేరగా నవంబర్లో రైల్వేబోర్డుకు సమర్పించనున్నారు. అదే సమయంలో విశాఖ నుంచి సూర్యాపేట, నల్గొండ, కల్వకుర్తి, నాగర్కర్నూల్ మీదుగా కర్నూలుకు మరో కారిడార్ను నిర్మించనున్నారు.