News October 26, 2024
ఎలక్ట్రీషియన్ల సేవలు కోసం ఊర్జవీర్ స్కీమ్
AP: రాష్ట్రంలోని 1.2లక్షల ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లను ‘ఊర్జవీర్ ఎనర్జీ ఎఫీషియన్సీ వారియర్ స్కీం’ కింద వినియోగించుకోవాలని GOVT నిర్ణయించింది. కేంద్రంతో కలిసి ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లనుంది. ఇంధన సామర్థ్య విద్యుత్ పరికరాలను వీరి సాయంతో ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో విద్యుత్ ఇండక్షన్ స్టవ్ల వినియోగం, వీధి దీపాల నిర్వహణలో వీరి సేవలను వినియోగించుకుంటామని CM చంద్రబాబు తెలిపారు.
Similar News
News October 26, 2024
సంతకం చేసి రూ.8కోట్లు గెలుచుకుంది!
అమెరికా రాజ్యాంగానికి మద్దతుగా తన ఆన్లైన్ పిటిషన్పై సంతకం చేసిన వ్యక్తికి ప్రతిరోజూ $1 మిలియన్ (సుమారు రూ. 8.40 కోట్లు) ఇస్తామని బిలియనీర్ ఎలాన్ మస్క్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా పిటిషన్పై సంతకం చేసిన నెవడాలోని పహ్రంప్కు చెందిన మేరీ 1 మిలియన్ డాలర్లు పొందారు. మేరీని అభినందిస్తూ ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. ఎన్నికల రోజు వరకు ప్రతిరోజూ సంతకం చేసిన ఒకరిని ఎంపిక చేసి ఈ బహుమతి ఇస్తారు.
News October 26, 2024
REWIND: హీరో ముద్దు పెట్టడంతో ఏడుస్తూ వెళ్లిపోయిన నటి
బాలీవుడ్ సీనియర్ నటి రేఖ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు. అయితే, తన కెరీర్ తొలినాళ్లలో ఆమెకు ఓ చేదు అనుభవం ఎదురైంది. 1969లో బిస్వజిత్ ఛటర్జీ సినిమాలో 15 ఏళ్ల రేఖకు అవకాశం వచ్చింది. రొమాన్స్ సీన్ చిత్రీకరణ సమయంలో నటుడు ముద్దు పెట్టడంతో ఆమె షాక్కు గురయ్యారు. సెట్లో ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు ది అన్టోల్డ్ స్టోరీలో రాసుకొచ్చారు.
News October 26, 2024
ఈ దీపావళికి వెలుగులనివ్వండి
దీపావళి సందర్భంగా ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించి సంబరాలు చేసుకుంటుంటారు. ఇంట్లో సుఖ సంతోషాలు, సిరి సంపదల కోసం దీపాలు వెలిగించడం శుభప్రదంగా భావిస్తారు. అయితే, ప్రమిదలు సైతం స్టైల్గా ఉండాలని కొందరు సిరామిక్ వాటిని కొనుగోలు చేస్తుంటారు. కానీ, చాలా మంది చిరు వ్యాపారులు మట్టితో చేసిన ప్రమిదలను రోడ్డు పక్కన పెట్టి అమ్ముతుంటారు. అక్కడ కొని వారికి అండగా నిలవండి. వారి ఇంట్లోనూ పండుగను తీసుకురండి.
Share It