News October 26, 2024
యూజర్లకు జియో దీపావళి ఆఫర్లు
టెలికం దిగ్గజం జియో దీపావళి ధమాకా పేరుతో యూజర్ల కోసం ఆఫర్లు ప్రకటించింది. రూ.899, రూ.3599 రీఛార్జ్ ప్లాన్లపై రూ.3350(ఈజీమై ట్రిప్, AJIO, స్విగ్గీ ఓచర్లు) విలువైన ప్రయోజనాలు పొందవచ్చు. రూ.899 ప్లాన్ ద్వారా 90 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 2GB డేటాతో పాటు అదనంగా 20GB డేటా లభిస్తుంది. రూ.3599 ప్లాన్లో 365 రోజులు రోజుకు 2.5GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ సదుపాయం పొందవచ్చు.
Similar News
News October 26, 2024
‘సరస్వతి’ భూముల్లో సర్వే
AP: మాజీ CM జగన్ కుటుంబానికి చెందిన సరస్వతి పవర్ భూముల్లో ప్రభుత్వం సర్వే చేపట్టింది. పల్నాడు జిల్లాలోని దాచేపల్లి, మాచవరం మండలాల్లో ఉన్న భూముల్లో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. కాగా వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు సరస్వతి పవర్ కంపెనీకి ఎకరా రూ.3 లక్షల చొప్పున 1,515.93 ఎకరాలు కేటాయించారు. ప్రస్తుతం వీటి విలువ రూ.వందల కోట్లలో ఉంటుందని అంచనా. వీటిలో అటవీ భూములు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
News October 26, 2024
‘కూలీ’ తర్వాత తలైవాతో నెల్సన్ సెకండ్ మూవీ
సూపర్ స్టార్ రజినీకాంత్తో మరోసారి సినిమా చేసేందుకు నెల్సన్ సిద్ధమయ్యారు. ప్రస్తుతం తలైవా లోకేశ్ కనగరాజ్తో కలిసి ‘కూలీ’ సినిమా తీస్తున్నారు. ఈ షూటింగ్ పూర్తికాగానే నెల్సన్ ప్రాజెక్ట్ మొదలవుతుందని సినీవర్గాలు పేర్కొన్నాయి. అయితే, అది కచ్చితంగా ‘జైలర్-2’ అని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘జైలర్’ మంచి విజయాన్ని అందుకోగా సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
News October 26, 2024
కోహ్లీ, రోహిత్పై క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్!
న్యూజిలాండ్తో సిరీస్లో విఫలమైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపై పలువురు టీమ్ఇండియా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీరిద్దరూ వెంటనే రిటైర్ కావాలంటూ Xలో ట్రెండ్ చేస్తున్నారు. గత కొంతకాలంగా ఈ సీనియర్ ఆటగాళ్లిద్దరూ స్థాయికి తగ్గట్లుగా ఆడట్లేదని, ఇకనైనా యంగ్ ప్లేయర్లకు అవకాశం ఇవ్వాలని అంటున్నారు. NZతో రెండో టెస్టులో రోహిత్ (0, 8), కోహ్లీ (1, 17) తక్కువే స్కోర్లకే వెనుదిరిగారు.