News October 26, 2024
BREAKING: కష్టాల్లో భారత్
న్యూజిలాండ్తో రెండో టెస్టులో భారత బ్యాటర్లు తడబడుతున్నారు. 359 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన భారత జట్టులో రోహిత్(8) వికెట్ త్వరగానే కోల్పోగా, గిల్(23), జైశ్వాల్(77) జోడీ స్కోరు బోర్డును కాసేపు పరుగులు పెట్టించారు. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే ఇద్దరూ ఔట్ కాగా, ఆ కాసేపటికే పంత్(0) కూడా రనౌట్ అయ్యారు. ప్రస్తుతం కోహ్లీ(14), సుందర్(3) ఆడుతున్నారు. భారత్ గెలవాలంటే ఇంకా 225 రన్స్ చేయాలి.
Similar News
News October 26, 2024
ఇందిరమ్మ ఇళ్లు.. బిగ్ అప్డేట్
TG: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్ను రూపొందించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు యాప్ను పరిశీలించిన ఆయన పలు మార్పులు చేయాలని సూచించారు. వచ్చే వారం దీనిని అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందని చెప్పారు. రాజకీయ పార్టీలు, ప్రాంతాలు అనే భేదం లేకుండా అర్హులైన వారికి త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని పేర్కొన్నారు.
News October 26, 2024
ఓటమిలోనూ మీ వెంటే: ఫ్యాన్స్
టెస్ట్ సిరీస్ ఓటమితో ట్రోలింగ్స్ ఎదుర్కొంటున్న టీమ్ ఇండియాకు కొందరు ఫ్యాన్స్ బాసటగా నిలుస్తున్నారు. ఓటమిలోనూ మీ వెంటే అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. వరుస విజయాలు సాధించినప్పుడు ప్రశంసించడమే కాదు.. వరుస పరాజయాలు ఎదురైనప్పుడు కూడా వారికి అండగా నిలవాలని అంటున్నారు. మరోవైపు సొంత గడ్డపై భారత జట్టు సిరీస్ కోల్పోవడాన్ని కొందరు ఫ్యాన్స్ జీర్ణించుకోలేక ఆటగాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
News October 26, 2024
Coldplay-Diljit concert: ఈడీ సోదాలు
సంగీత ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న Coldplay, Diljit కన్సర్ట్స్కు సంబంధించి నకిలీ టికెట్లు, ధరల దోపిడీ వ్యవహారంలో ED దర్యాప్తు ముమ్మరం చేసింది. BookMyShow, పలువురిపై నమోదైన కేసుల్లో ఢిల్లీ, ముంబై, జైపూర్, చండీగఢ్, బెంగళూరులో సోదాలు నిర్వహించింది. సామాజిక మాధ్యమాల్లో బ్లాక్ మార్కెట్కు తెరలేపి అనధికార, నకిలీ టికెట్లు విక్రయిస్తున్న వారిని గుర్తించినట్టు ED అధికారి తెలిపారు.