News October 26, 2024

‘కూలీ’ తర్వాత తలైవాతో నెల్సన్ సెకండ్ మూవీ

image

సూపర్ స్టార్ రజినీకాంత్‌తో మరోసారి సినిమా చేసేందుకు నెల్సన్ సిద్ధమయ్యారు. ప్రస్తుతం తలైవా లోకేశ్ కనగరాజ్‌తో కలిసి ‘కూలీ’ సినిమా తీస్తున్నారు. ఈ షూటింగ్ పూర్తికాగానే నెల్సన్ ప్రాజెక్ట్ మొదలవుతుందని సినీవర్గాలు పేర్కొన్నాయి. అయితే, అది కచ్చితంగా ‘జైలర్-2’ అని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘జైలర్’ మంచి విజయాన్ని అందుకోగా సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

Similar News

News November 3, 2025

ఎటు చూసినా మృతదేహాలే..

image

TG: చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి <<18183773>>బస్సు<<>> ప్రమాద మృతుల బంధువుల ఆర్తనాదాలతో దద్దరిల్లిపోయింది. ఎటు చూసినా మృతదేహాలే కనిపిస్తుండడంతో ఆ ప్రాంతం శ్మశానాన్ని తలపిస్తోంది. ఆసుపత్రిలో సరిపడా బెడ్లు లేకపోవడంతో క్షతగ్రాతులను బెంచ్‌లపై పడుకోబెట్టి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో పలువురిని ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. మరోవైపు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తారని సమాచారం.

News November 3, 2025

శివారాధన సోమవారమే ఎందుకు?

image

సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు తన రూపాన్ని పూర్తిగా కోల్పోకుండా కాపాడి శివుడు సోమనాథుడయ్యాడు. నెలవంకను శిరస్సున ధరించి చంద్రశేఖరుడయ్యాడు. అందుకే ఈరోజున శివారాధన చేస్తే శివ సాక్షాత్కారం అందడమే కాక చంద్రుడి అనుగ్రహంతో ప్రశాంతత కలుగుతుందని శివ మహాపురాణం చెబుతోంది. సోమవారం ఈశ్వరుడిని ఏవిధంగా సేవించినా తప్పక మోక్షం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
☞ మరిన్ని ఆధ్యాత్మిక కథనాల కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.

News November 3, 2025

ఘోరం.. ఆనవాళ్లు లేకుండా మారిన బస్సు

image

రంగారెడ్డి జిల్లాలో టిప్పర్ ఢీకొట్టి మీద పడటంతో <<18183932>>బస్సు<<>> పూర్తిగా ధ్వంసమైంది. ముఖ్యంగా కుడివైపు ఉండే భాగం ఆనవాళ్లు లేకుండా అయింది. దీంతో ప్రమాద తీవ్రత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. టన్నుల కొద్దీ బరువు ఉండే కంకర మీద పడటంతో ప్రయాణికులు దాని కింద సమాధి అయిపోయారు. జేసీబీల సాయంతో టిప్పర్‌ను బస్సుపై నుంచి తొలగించారు. మృతదేహాలను చేవెళ్ల ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 72 మంది ఉన్నట్లు సమాచారం.