News October 26, 2024

రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసిన MLAలు, MP

image

ఒంగోలులోని మంగమ్మ కాలేజీ జంక్షన్‌లో రూ.1.30 కోట్లతో నూతనంగా మంజూరైన రోడ్డు నిర్మాణానికి పలువురు టీడీపీ నేతలు భూమి పూజ చేశారు. మంగమ్మ కాలేజీ జంక్షన్ నుంచి, కర్నూల్ రోడ్డు ఫ్లైఓవర్ వరకు గల తారు రోడ్డుకు భూమి పూజా కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ రావు, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొని భూమి పూజ చేశారు.

Similar News

News January 8, 2026

అర్ధవీడులో జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్

image

సంక్రాంతి, రిపబ్లిక్ డే పురస్కరించుకుని ఈనెల 10న అర్ధవీడులో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఈ టోర్నమెంట్‌లో గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతి రూ.25,000, రెండో బహుమతి రూ.15,000 మూడో బహుమతి రూ.8000లు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆసక్తి గలవారు ఈ టోర్నమెంట్‌లో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.

News January 8, 2026

మీ సమస్యలను సీఎంకు చెబుతా: గొట్టిపాటి

image

ప్రకాశం జిల్లాలోని పొగాకు రైతుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పలువురు రైతులు మంత్రి గొట్టిపాటికి బుధవారం వినతిపత్రాన్ని అందజేశారు. సిగరెట్లపై ఎక్సైజ్ పన్ను భారీగా పెంచడంతో డిమాండ్ తగ్గి ధరలు పడిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాలని రైతులు కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు.

News January 8, 2026

మార్కాపురం: వృద్ధులే లక్ష్యంగా డిజిటల్ అరెస్ట్ స్కామ్: ఎస్పీ

image

వృద్ధులే లక్ష్యంగా జరుగుతున్న డిజిటల్ అరెస్ట్ స్కామ్ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని SP హర్షవర్ధన్ రాజు అన్నారు. సీబీఐ, ఈడీ కోర్టు అధికారులమని చెప్పి మీ పిల్లలపై కేసు ఉంది, ఇప్పుడే అరెస్టు చేస్తామని భయపెట్టి డబ్బులు దోచుకోవడమే డిజిటల్ అరెస్ట్ అని అన్నారు. అపరిచితుల వీడియో కాల్ ఎత్తవద్దని, బ్యాంకు వివరాలు చెప్పవద్దన్నారు. సైబర్ క్రైమ్ బాధితులు 1930కి కాల్ చేయాలని సూచించారు.