News October 26, 2024
ఇండియాలో అత్యధిక పరుగులు చేసిన జైస్వాల్

భారత్లో జరిగిన టెస్టుల్లో ఒక క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో యశస్వీ జైస్వాల్ అగ్రస్థానానికి చేరారు. 2024లో భారత్లో జరిగిన 9 టెస్టుల్లో జైస్వాల్ 66 సగటుతో 1056 రన్స్ చేశారు. వాటిలో 2 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తాజాగా ముగిసిన మ్యాచ్లో 77 రన్స్ చేసిన యశస్వి.. దిగ్గజ బ్యాటర్ గుండప్ప విశ్వనాథ్ 1979లో (13 మ్యాచుల్లో 1047 రన్స్) నెలకొల్పిన రికార్డును అధిగమించారు.
Similar News
News November 12, 2025
వారితో మాకు సంబంధం లేదు: అల్ ఫలాహ్ యూనివర్సిటీ

ఢిల్లీ <<18265346>>ఎర్రకోట <<>>వద్ద పేలుడు కేసులో ప్రధాన నిందితులు అల్ ఫలాహ్ వర్సిటీ డాక్టర్లేనని అనుమానిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమపై వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని వర్సిటీ VC భూపిందర్ కౌర్ తెలిపారు. డాక్టర్లు ముజామిల్, షాహీన్తో తమకు సంబంధం లేదన్నారు. ‘మేం ఎలాంటి రసాయనాలు నిల్వ చేయట్లేదు. ఉపయోగించట్లేదు. స్టూడెంట్ల అకడమిక్, ట్రైనింగ్ కోసం అవసరమైనంత వాడుతున్నాం’ అని పేర్కొన్నారు.
News November 12, 2025
ప్లాన్ చేసి ప్రిపేర్ అయితే.. ప్రభుత్వ ఉద్యోగం పక్కా

ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అయితే ప్రభుత్వ ఉద్యోగానికి నిర్వహించే రాత, ఫిజికల్, మెడికల్ టెస్టుల్లో పాస్ కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్పై ప్రత్యేక దృష్టిపెట్టాలి. సమయపాలన ముఖ్యమని గుర్తుంచుకోవాలి. మాక్ టెస్టులు ఎక్కువగా రాయాలి. పోలీస్, ఆర్మీ, బీఎస్ఎఫ్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఫిజికల్ ఫిట్నెస్పై శ్రద్ధపెట్టాలి.
News November 12, 2025
CWCలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు

సెంట్రల్ వేర్హౌసింగ్ కార్పొరేషన్(CWC) 11 కాంట్రాక్ట్ యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి ఈనెల 25వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి LLB/LLM, MBA/PGDM, MSc(స్టాటిస్టిక్స్), BSc(స్టాటిస్టిక్స్), BBA, ఎంటెక్, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.


