News October 26, 2024
ఇండియాలో అత్యధిక పరుగులు చేసిన జైస్వాల్
భారత్లో జరిగిన టెస్టుల్లో ఒక క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో యశస్వీ జైస్వాల్ అగ్రస్థానానికి చేరారు. 2024లో భారత్లో జరిగిన 9 టెస్టుల్లో జైస్వాల్ 66 సగటుతో 1056 రన్స్ చేశారు. వాటిలో 2 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తాజాగా ముగిసిన మ్యాచ్లో 77 రన్స్ చేసిన యశస్వి.. దిగ్గజ బ్యాటర్ గుండప్ప విశ్వనాథ్ 1979లో (13 మ్యాచుల్లో 1047 రన్స్) నెలకొల్పిన రికార్డును అధిగమించారు.
Similar News
News October 26, 2024
జియో ఆఫర్.. రూ.699కే..
జియో భారత్ 4G ఫోన్ ధర రూ.999 నుంచి రూ.699కి తగ్గింది. ఈ ధర దీపావళి సందర్భంగా మాత్రమే అందుబాటులో ఉంటుందని జియో తెలిపింది. ఇక ఈ ఫోన్లో వాడే నెలవారీ రీఛార్జ్ ప్లాన్ ఇతర సంస్థల బేసిక్ ప్లాన్ కంటే రూ.76 తక్కువ ధరతో రూ.123 మాత్రమే అని వెల్లడించింది. ఈ రకంగా వినియోగదారులు 9 నెలల్లో ఫోన్ కోసం చెల్లించిన ధరను తిరిగి పొందవచవ్చని పేర్కొంది. ఇందులో అన్ని డిజిటల్ సేవలను జియో అందిస్తోంది.
News October 26, 2024
మా పౌరుడి డెత్ సర్టిఫికెట్ మీకెందుకు?.. NIAకి కెనడా కౌంటర్ ప్రశ్నలు
ఖలిస్థానీ వేర్పాటువాది నిజ్జర్ డెత్ సర్టిఫికెట్ ఇవ్వాలన్న NIA విజ్ఞప్తిపై కెనడా కాలయాపన చేస్తోంది! కెనడా పౌరుడి డెత్ సర్టిఫికెట్ మీకెందుకు అంటూ కౌంటర్ ప్రశ్నలు వేస్తోంది. నిజ్జర్పై 9 కేసుల్లో NIA దర్యాప్తు చేస్తోంది. న్యాయపరమైన అవసరాల నిమిత్తం నిజ్జర్ మృతిపై కోర్టులకు సమాచారం ఇవ్వాల్సి ఉందని ఎన్ఐఏ బదులిచ్చినట్టు తెలుస్తోంది. నిజ్జర్ హత్య కేసులో దౌత్య వివాదం ఇంకా కొనసాగుతోంది.
News October 26, 2024
వ్యర్థాలను తొలగించని బిల్డర్లపై చర్యలు: హైడ్రా
TG: హైడ్రా కూల్చిన తర్వాత భవన వ్యర్థాలను తొలగించే బాధ్యత సంబంధిత బిల్డర్లదేనని హైడ్రా కమిషనర్ స్పష్టం చేశారు. వాటిని తొలగించని వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ‘ప్రభుత్వ అనుమతులు ఉన్న భవనాలను ఎట్టి పరిస్థితుల్లో కూల్చం. సర్వే నంబర్లు మార్చి, తప్పుడు సమాచారంతో అనుమతులు పొంది చెరువులు, నాలాల్లో చేపట్టిన నిర్మాణాలనే కూల్చుతాం. దీనిపై ఎవరూ ఆందోళన చెందొద్దు’ అని ఆయన పేర్కొన్నారు.