News October 26, 2024
దీపావళికి ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా.. కేంద్రం వార్నింగ్!

దీపావళికి ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని CERT-In సూచించింది. ఫిషింగ్, లాటరీ, జాబ్, టెక్ సపోర్ట్, ఇన్వెస్ట్మెంట్, COD, ఫేక్ ఛారిటీ, పొరపాటున నగదు పంపడం, డిజిటల్ అరెస్ట్, ఫోన్, పార్సిల్ స్కామ్లపై వార్నింగ్ ఇచ్చింది. కాలర్ను వెరిఫై చేసుకోవాలని, భయపడొద్దని, వ్యక్తిగత సమాచారం ఇవ్వొద్దని, రిమోట్ యాక్సెస్ సాఫ్ట్వేర్, APPS ఇన్స్టాల్ చేయొద్దని, లింకులు క్లిక్ చేయొద్దని చెప్పింది.
Similar News
News February 3, 2026
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<
News February 3, 2026
గుడిలో దర్శనం తర్వాత ఎందుకు కూర్చోవాలి?

ఆలయం ప్రశాంతతకు నిలయం. దైవ దర్శనంతో మనలోని కోపం, అహంకారం, స్వార్థం తాత్కాలికంగా దూరమవుతాయి. దర్శనం ముగిసిన వెంటనే జనబాహుళ్యంలోకి వెళ్తే మనసు మళ్లీ పాత ధోరణిలోకి వెళ్ళే అవకాశం ఉంది. అందుకే కాసేపు ప్రశాంతంగా కూర్చుంటే, ఆ దేవాలయంలో జరిగే యజ్ఞ యాగాది క్రతువుల పుణ్య ఫలం వల్ల మనసులోని కల్మషం కరిగిపోతుంది. తద్వారా మనసు ప్రశాంతంగా మారి, కొంత సమయమైనా ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన స్థితిని మనం పొందగలుగుతాము.
News February 3, 2026
ఆ నివేదిక వచ్చాకే రైతులకు రూ.6వేలు!

TG: సాగు విస్తీర్ణంపై అధికారులు జయశంకర్ వర్సిటీ ద్వారా శాటిలైట్ సర్వే నిర్వహించారు. ఆ రిపోర్టు ఈ నెల 6వ తేదీకల్లా ఇవ్వాలని ప్రభుత్వం ముందు ఆదేశించింది. తాజాగా మండలాల వారీ నివేదికలు అడగడంతో అధికారులు వాటిని సేకరిస్తున్నారు. దీని ప్రభావం రైతులకు రూ.6వేలు చొప్పున అందాల్సిన 2వ విడత రైతు భరోసాపై పడింది. ఈ నివేదిక అందిన వెంటనే రైతు భరోసా విడుదలకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అధికారులు పేర్కొన్నారు.


