News October 26, 2024

అనంతపురం మృతుల కుటుంబాలకు సీఎం సానుభూతి

image

అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సింగనమల మండలం, నాయనపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ఇస్కాన్ టెంపుల్ భక్తులు దుర్మరణం చెందడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Similar News

News September 19, 2025

అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలి: కలెక్టర్

image

అనంతపురం: వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. పథకాలను క్షేత్రస్థాయిలో రైతులకు చేరవేసే విధంగా విస్తృత అవగాహన కల్పించాలని కోరారు. గురువారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులతో ఆయన సమీక్షించారు. యూరియా పంపిణీ అవసరం ఉన్న చోట తప్పకుండా సరఫరా చేయాలని సూచించారు.

News September 18, 2025

ATP: అధికారులతో కలెక్టర్ సమీక్ష

image

ప్రభుత్వ అధికారులు పనితీరు మెరుగుపరచుకుని సత్ఫలితాలు సాధించాలని కలెక్టర్ ఆనంద్ సూచించారు. గురువారం అనంతపురం కలెక్టరేట్‌లో పరిశ్రమల శాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. పరిశ్రమల ఏర్పాటుకు సహకరించాలన్నారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. భారీ పరిశ్రమలకు స్థల సేకరణ పనులను వేగవంతం చేయాలని పేర్కొన్నారు.

News September 18, 2025

ఆలూరు సాంబశివారెడ్డికి కీలక పదవి

image

అనంతపురం జిల్లా వైసీపీ నేత ఆలూరు సాంబశివారెడ్డిని వైసీపీ స్టేట్ అడ్మిన్ హెడ్‌గా నియమిస్తూ ఆ పార్టీ ప్రకటన విడుదల చేసింది. మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న సాంబశివారెడ్డిని స్టేట్ అడ్మిన్ హెడ్‌గానూ నియమించినట్లు చెప్పింది. ఈ నియామకంపై సాంబశివారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతం చేయడానికి మరింత కృషి చేస్తానని పేర్కొన్నారు.