News October 26, 2024
బనగానపల్లె: చౌడమ్మను దర్శించుకున్న మల్టీ జోన్ 2 RJC

నందవరం శ్రీ చౌడేశ్వరి అమ్మవారిని దేవదాయ -ధర్మాదాయ శాఖ మల్టీ జోన్ -2 రీజినల్ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర ఆజాద్ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఈఓ కామేశ్వరమ్మ, అర్చక బృందం ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు, వేదపండితులు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. ఆయన వెంట డిప్యూటీ కమిషనర్ పట్టెం గురుప్రసాద్, R.S.రంగాపురం, E.O.రామాంజనేయులు, ఎస్.కొత్తూరు E.O రామకృష్ణ ఉన్నారు.
Similar News
News March 11, 2026
కర్నూలు జిల్లాలో ఇంటర్ పరీక్షలకు 153 మంది గైర్హాజరు

కర్నూలు జిల్లాలో బుధవారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 153 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 4,242 మందికి గానూ 4,089 మంది మాత్రమే హాజరైనట్లు ప్రాంతీయ అధికారి లాలప్ప తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని, ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని ఆయన వెల్లడించారు. నిబంధనల ప్రకారం పరీక్షలు నిర్వహించినట్లు స్పష్టం చేశారు.
News March 11, 2026
OTPలు ఎవరికీ చెప్పకండి: జేసీ

కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో డిజిటల్ లావాదేవీలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు RBI రూపొందించిన పోస్టర్లను జేసీ నూరుల్ ఖమర్ ఆవిష్కరించారు. జేసీ మాట్లాడుతూ.. ఈనెల 9 నుంచి 13వ తేదీ వరకు ‘డిజిటల్ పేమెంట్స్ అవేర్నెస్ వీక్’ నిర్వహిస్తున్నామన్నారు. బ్యాంక్ అధికారులమని చెప్పినా ఎవరికీ OTP చెప్పకూడదన్నారు. కేవలం బ్యాంక్ అధికారిక యాప్స్, వెబ్సైట్ల ద్వారానే లావాదేవీలు చేయాలన్నారు.
News March 10, 2026
కర్నూలు: రూ.14,740 కోట్ల రుణ ప్రణాళిక విడుదల

KNL కలెక్టరేట్లో నాబార్డు రూపొందించిన 2026-27 ఆర్థిక సంవత్సరపు పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ పుస్తకాన్ని జేసి నూరుల్ ఖమర్ మంగళవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధికి బ్యాంకులు వెన్నుదన్నుగా నిలవాలన్నరు. మొత్తం రుణ అంచనా రూ.14,740 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.9,283 కోట్లు, విద్యా రుణాలు రూ.203 కోట్లు, MSME 3,653 కోట్లు, గృహ రుణాలు రూ.287 కోట్లుగా నాబార్డు అంచనా వేసింది.


