News October 26, 2024
లారెన్స్ బిష్ణోయ్ తరఫున నామినేషన్ వేస్తాం: UBVS పార్టీ
గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ను ఎన్నికల్లో పోటీ చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అతని తరఫున మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు AB ఫారం ఇవ్వాలంటూ UBVS పార్టీ నేత సునీల్ శుక్లా ROకి లేఖ రాశారు. బాంద్రా వెస్ట్ నుంచి బిష్ణోయ్ను పోటీకి దింపుతామని, నామినేషన్ ఫారం ఇస్తే అతని సంతకం తీసుకొస్తానని శుక్లా పేర్కొన్నారు. హత్యకు గురైన సిద్ధిఖీ గతంలో ఇక్కడ MLAగా గెలుపొందారు.
Similar News
News October 27, 2024
సుమతీ శతకం.. తాత్పర్యం
కనకపు సింహాసనమున
శునకము గూర్చుండబెట్టి శుభలగ్నమునం
దొనరగ బట్టము గట్టిన
వెనుకటి గుణమేల మాను వినురా సుమతీ!
తాత్పర్యం: బంగారపు సింహాసనంపై కుక్కను కూర్చోబెట్టినా దాని బుద్ధిని విడిచిపెట్టదు. అలాగే హీనుని ఉన్నత స్థానంలో కూర్చోబెట్టినా అతని బుద్ధి మారదు.
News October 27, 2024
ఈ దేశాల్లో శాంతిభద్రతలు భేష్!
ఎటు చూసినా యుద్ధాలు, అశాంతి నెలకొన్న నేటి కాలంలో శాంతిభద్రతల్ని కలిగి ఉన్న దేశాలు చాలా తక్కువనే చెప్పాలి. అలాంటి ప్రశాంతమైన దేశాల జాబితాలో డెన్మార్క్ అగ్రస్థానంలో ఉన్నట్లు వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ రూపొందించిన సూచీ తెలిపింది. దాని ప్రకారం.. రెండో స్థానంలో నార్వే, మూడో స్థానంలో ఫిన్లాండ్, 4, 5 స్థానాల్లో స్వీడన్, జర్మనీ ఉన్నాయి. భారత్ 79వ ర్యాంకు దక్కించుకోగా చైనా 95, పాక్ 129వ స్థానాల్లో నిలిచాయి.
News October 27, 2024
సీఎస్కేలో ధోనీకి సరైన వారసుడు పంతే: సైమన్
చెన్నై సూపర్ కింగ్స్లో ధోనీకి సరైన వారసుడు రిషభ్ పంతేనని న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ అభిప్రాయపడ్డారు. ‘పంత్ గనుక ఢిల్లీని వదిలేసి వేలంలోకి వస్తే అతడిని దక్కించుకునేందుకు చెన్నై ఎంతవరకైనా వెళ్తుంది. ధోనీ తర్వాత సరైన ప్రత్యామ్నాయం అతడే. మరి రిషభ్ను ఢిల్లీ వదులుకుంటుందా లేదా అన్నది చూడాలి’ అని పేర్కొన్నారు. తాను వేలంలోకి వస్తే ఎంత ధర వస్తుందంటూ పంత్ ఇటీవల ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.