News October 27, 2024

దక్షిణ కొరియాకు ‘ఒంటరి మరణాల’ సమస్య

image

దక్షిణ కొరియాలో భారీగా పెరుగుతున్న ‘ఒంటరి మరణాలు’ ఆ ప్రభుత్వానికి ఆందోళనను కలిగిస్తున్నాయి. ఒంటరితనంతో బాధపడుతున్న వేలాదిమంది నడి వయసు పురుషులు తమవారికి తెలియకుండా ఒంటరిగా మరణిస్తున్నారు. ఈ తరహా మరణాలు గత ఏడాది 3661 నమోదయ్యాయి. ఈ సమస్యని చక్కదిద్దేందుకు వచ్చే ఐదేళ్లలో 327 మిలియన్ డాలర్ల విలువైన చర్యలు తీసుకోవాలని సియోల్ నిర్ణయించింది. ఇప్పటికే పౌరులకోసం 24 గంటల హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది.

Similar News

News January 22, 2026

కూటమిని విడగొడితేనే జగన్ అధికారంలోకి వస్తారు: విజయసాయి

image

AP: మాజీ MP విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత కూటమి ఇలాగే కొనసాగితే జగన్ మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి రావడం కష్టమని అన్నారు. కూటమిని విడగొడితేనే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. జగన్ చుట్టూ ఉన్న కోటరీ ఆయనను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. ఏపీ మద్యం స్కామ్‌ కేసులో ఈడీ విచారణ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు సంబంధం లేని కేసుల్లో ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు.

News January 22, 2026

అవును.. ప్రేమలో ఉన్నా: ఫరియా అబ్దుల్లా

image

తాను ప్రేమలో ఉన్నట్లు టాలీవుడ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ అబ్బాయి హిందువా ముస్లిమా అని యాంకర్ అడగగా హిందువేనని బదులిచ్చారు. లవ్ వల్ల తన లైఫ్‌లో బ్యాలెన్స్ వచ్చిందని ఆమె పేర్కొన్నారు. తాను, తన బాయ్ ఫ్రెండ్ స్కూల్ ఫ్రెండ్స్ కాదని, అతడు డాన్స్ బ్యాక్ గ్రౌండ్‌కు చెందిన వ్యక్తి అని తెలిపారు. తాను ర్యాప్, డాన్స్‌లో రాణించడానికి అతడి సపోర్టే కారణమని చెప్పారు.

News January 22, 2026

అప్పుడు CBI ఎందుకు గుర్తుకు రాలేదు?: కిషన్ రెడ్డి

image

TG: గతంలో BRS, ఇప్పుడు INC పాలనలో సింగరేణిపై ఆర్థిక విధ్వంసం కొనసాగుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ‘నైనీ కోల్ బ్లాక్‌ టెండర్లపై కొందరు CBI దర్యాప్తు కోరుతున్నారు. కానీ రాష్ట్ర అంశాలను CBI దర్యాప్తు చేయకూడదని గత ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానించింది. అప్పుడు CBI ఎందుకు గుర్తుకు రాలేదు?’ అని ప్రశ్నించారు. కోల్ బ్లాక్స్‌ వేలం నిర్వహణకు కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.