News October 27, 2024
39 మంది కానిస్టేబుళ్లపై వేటు
TG: కొన్ని రోజులుగా ఆందోళన చేస్తోన్న బెటాలియన్ కానిస్టేబుళ్లపై పోలీస్ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరసనలకు ప్రేరేపిస్తున్న 39 మందిని సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు వెలువరించింది. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి ఆందోళనలు చేయడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది.
Similar News
News October 27, 2024
కొత్త టీచర్లకు జీతాల చెల్లింపు ప్రాతిపదిక ఇదే
TG: రాష్ట్రంలో కొత్తగా విధుల్లో చేరిన 10వేల మంది టీచర్లకు జీతాల చెల్లింపుపై నెలకొన్న సందిగ్ధతకు ప్రభుత్వం తెరదించింది. అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన ఈ నెల 10వ తేదీని ప్రాతిపదికగా తీసుకుంటామని తెలిపింది. టీచర్లు ఆ తేదీన విధుల్లో చేరి ఉండాలంది. కౌన్సెలింగ్ ఆలస్యమవడంతో ఆలస్యంగా రిపోర్టు చేసిన వారికి ఆయా తేదీల నుంచి జీతం ఇస్తామని పేర్కొంది.
News October 27, 2024
నేడు ఏపీ టెట్ ఫైనల్ కీ విడుదల
AP: ఈ నెల 3 నుంచి 21 వరకు జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్షల ఫైనల్ కీ నేడు విడుదల కానుంది. https://aptet.apcfss.in/ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నవంబర్ 2న తుది ఫలితాలను అధికారులు రిలీజ్ చేస్తారు. ఈసారి టెట్కు 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా 3,68,661 (86.28 శాతం) మంది హాజరయ్యారు.
News October 27, 2024
సంయమనం పాటించండి.. ఇరాన్-ఇజ్రాయెల్కు భారత్ సూచన
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ప్రతీకార దాడులపై భారత ప్రభుత్వం స్పందించింది. ‘పశ్చిమాసియాలో పరిణామాలను మేం పరిశీలిస్తున్నాం. ఇరు దేశాలు సంయమనం పాటించి దౌత్య మార్గాలపై దృష్టిసారించాలి. ఉద్రిక్తతలు, శత్రుత్వాలతో ఎవరికీ ప్రయోజనం ఉండదు. అమాయక పౌరులు, బందీలు బాధపడుతూనే ఉంటారు’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ ఓ ప్రకటన విడుదల చేశారు.