News October 27, 2024
విశాఖ-విజయవాడ మధ్య 2 విమాన సర్వీసులు
AP: విశాఖ-విజయవాడ మధ్య కొత్తగా 2 విమాన సర్వీసులను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నేడు ప్రారంభించనున్నారు. ఎయిర్ఇండియా ఎక్స్ప్రెస్ ఉ.9.35కు విశాఖలో బయలుదేరి ఉ.10.35కు గన్నవరం చేరుకుంటుంది. తిరిగి రాత్రి 7.55కు విజయవాడ నుంచి బయలుదేరి రా.9 గంటలకు విశాఖకు చేరుతుంది. ఇండిగో సర్వీసు రా.7.15కు విజయవాడ నుంచి విశాఖకు వెళ్లి, తిరిగి రా.8.45కు అక్కడి నుంచి బయలుదేరి గన్నవరం చేరుకుంటుంది.
Similar News
News October 27, 2024
ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.. నేడే లాస్ట్
నాన్ టెక్నికల్ కేటగిరీ(NTPC)లో 3,693 పోస్టులకు RRB దరఖాస్తులు స్వీకరిస్తోంది. అభ్యర్థులు ఇంటర్ ఉత్తీర్ణతతో 18 నుంచి 33 ఏళ్ల లోపు వయసు కలిగి ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంది. ఈ నెల 27 వరకు అప్లికేషన్లు స్వీకరించనుంది. దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు రూ.500. మహిళలు, ఎస్టీ, ఎస్సీ, ఈబీసీలకు రూ.250. వెబ్సైట్: https://www.rrbapply.gov.in/
News October 27, 2024
ఉదయం చలి.. పగలు ఎండ
AP: రాష్ట్ర ప్రజలను ఉదయం పూట చలి వణికిస్తుంటే మధ్యాహ్నం ఎండ బాదుతోంది. శీతాకాలం ప్రవేశిస్తున్న నేపథ్యంలో రాత్రివేళ ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. అటు పగటిపూట ఎండ తీవ్రత కొనసాగుతోంది. శనివారం పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-5 డిగ్రీలు ఎక్కువగా, రాత్రి ఉష్ణోగ్రతలు 1-2 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. వాయవ్య భారతం నుంచి వీస్తున్న గాలులతో పగటిపూట ఎండ తీవ్రత పెరిగిందని వాతావరణ నిపుణులు అంటున్నారు.
News October 27, 2024
సైబర్ నేరాల నియంత్రణకు AI పరిష్కారాలు!
సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు AI పరిష్కారాల కోసం కేంద్రం కసరత్తు చేస్తోంది. IndiaAI ఇనిషియేటివ్లో భాగంగా నేషనల్ సైబర్ క్రైం పోర్టల్ (NCRP)లో పౌరులు సులభంగా సైబర్ నేరాలపై ఫిర్యాదు చేసే విధంగా, నేర విధానాల ఆధారంగా వాటి విభజనకు అవసరమైన Natural Language Processing వృద్ధికి ఔత్సాహికులను ఆహ్వానించింది. రోజూ నమోదయ్యే 6K కేసుల నిర్వహణ, నేరాల నియంత్రణకే ఈ ప్రయత్నాలని ఓ అధికారి తెలిపారు.