News October 27, 2024
కొత్త టీచర్లకు జీతాల చెల్లింపు ప్రాతిపదిక ఇదే
TG: రాష్ట్రంలో కొత్తగా విధుల్లో చేరిన 10వేల మంది టీచర్లకు జీతాల చెల్లింపుపై నెలకొన్న సందిగ్ధతకు ప్రభుత్వం తెరదించింది. అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన ఈ నెల 10వ తేదీని ప్రాతిపదికగా తీసుకుంటామని తెలిపింది. టీచర్లు ఆ తేదీన విధుల్లో చేరి ఉండాలంది. కౌన్సెలింగ్ ఆలస్యమవడంతో ఆలస్యంగా రిపోర్టు చేసిన వారికి ఆయా తేదీల నుంచి జీతం ఇస్తామని పేర్కొంది.
Similar News
News October 27, 2024
20 లక్షల ఉద్యోగాల కల్పనపై క్యాబినెట్ సబ్ కమిటీ
AP: 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యాన్ని చేరుకునేందుకు విధివిధానాలు రూపొందిస్తోంది. ఈమేరకు ఆరుగురు మంత్రులతో క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. దీనికి మంత్రి లోకేశ్ ఛైర్మన్గా వ్యవహరించనున్నారు. ఉద్యోగాల కల్పనలో భాగంగా ప్రభుత్వం రాష్ట్రానికి భారీ పెట్టుబడులపై ఫోకస్ పెట్టనుంది.
News October 27, 2024
‘దృశ్యం’లో వెంకటేశ్ చిన్నకూతురు.. ఇప్పుడెలా అయ్యారో చూడండి!
విక్టరీ వెంకటేశ్-మీనా నటించిన ‘దృశ్యం’ సినిమా బ్లాక్బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అందులో వారి పెద్దకూతురిగా కృతిక, చిన్నకూతురిగా ఎస్తేర్ అనిల్ అద్భుతంగా నటించి ప్రశంసలు పొందారు. తాజాగా ఎస్తేర్ ఫొటోలు నెట్టింట వైరల్ కాగా ‘ఆ అమ్మాయి ఇప్పుడు ఇలా అయిందా?’ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ‘దృశ్యం’లో మలయాళంతో పాటు తెలుగు, తమిళ్ భాషల్లోనూ ఎస్తేరే నటించారు.
News October 27, 2024
Swiggy IPO: Nov 6-8 మధ్య పబ్లిక్ సబ్స్క్రిప్షన్
Swiggy IPO పబ్లిక్ సబ్స్క్రిప్షన్ నవంబర్ 6-8 తేదీల మధ్య జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. $11.3 బిలియన్ల (₹93,790 కోట్లు) IPO వాల్యుయేషన్ను సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. IPO ప్రైమరీ కాంపోనెంట్ను సుమారు ₹4,500 కోట్లకు పెంచారు. ఇన్వెస్టర్ల ఆసక్తికి అనుగుణంగా OFS కాంపోనెంట్నూ సవరించినట్లు తెలిసింది. మొత్తం IPO పరిమాణం ₹11,700 కోట్ల నుంచి ₹11,800 కోట్ల మధ్య ఉండవచ్చని పేర్కొన్నాయి.