News October 27, 2024
టీజీఎస్పీ కానిస్టేబుళ్ల డిమాండ్లు ఇవే

TG: రాష్ట్ర స్పెషల్ పోలీస్(TGSP) కానిస్టేబుళ్లు ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు. సివిల్ పోలీసుల మాదిరి 3-5ఏళ్లు ఒకే చోట పనిచేయించాలని, స్థానికత ఆధారంగా పోస్టింగ్ ఇవ్వాలని, ఏక్ స్టేట్- ఏక్ పోలీస్ విధానాన్ని అమలు చేయాలని కోరుతున్నారు. 15రోజులు డ్యూటీ చేస్తే 4రోజులు సెలవుల విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసి 26రోజుల డ్యూటీకి 4రోజుల సెలవును ప్రకటించింది. ఆందోళనలతో ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకుంది.
Similar News
News February 17, 2026
ముగ్గురు IASలను పెళ్లి చేసుకున్న IAS ఆఫీసర్!

IAS ఆఫీసర్ అవీ ప్రసాద్ 3 పెళ్లిళ్లు చేసుకోవడం, ముగ్గురు భార్యలూ IASలే కావడం చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రదేశ్ క్యాడర్(2014 బ్యాచ్)కి చెందిన ప్రసాద్ తొలుత IAS రిజు బఫ్నాను పెళ్లి చేసుకున్నారు. తర్వాత విడాకులు తీసుకొని 2016 బ్యాచ్ ఆఫీసర్ మిషా సింగ్ను వివాహమాడారు. 4ఏళ్ల తర్వాత ఆమె నుంచీ విడిపోయారు. ఈనెల 11న 2017 బ్యాచ్ ఆఫీసర్ అంకిత ధాక్రేను పెళ్లాడారు. వీరంతా ప్రస్తుతం MPలోనే పనిచేస్తున్నారు.
News February 17, 2026
రైళ్ల టాయిలెట్ల శుభ్రతకు ఏఐ టెక్నాలజీ

రైళ్లలో అపరిశుభ్రతకు కేరాఫ్ అడ్రస్గా టాయిలెట్లు ఉంటాయి. ఈ సమస్య పరిష్కారానికి రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. రిజర్వ్, జనరల్ బోగీల్లోనూ గంటకోసారి శుభ్రం చేసేలా AIని వాడుతోంది. తొలిదశలో 100 రైళ్లలో ప్రారంభించినట్లు చీఫ్ ప్రాజెక్ట్ ఇంజినీర్ లక్ష్మణ్ తెలిపారు. ‘క్లీనింగ్కు ముందు, తర్వాత ఫొటోలను మొబైల్ యాప్లో సిబ్బంది అప్లోడ్ చేయాలి. వాటిలో ఏ మాత్రం తేడా ఉన్నా AI అప్రమత్తం చేస్తుంది’ అని చెప్పారు.
News February 16, 2026
ప్రపంచానికే పరిష్కారాలు చూపుతాం: మోదీ

ఢిల్లీ కేంద్రంగా నేటి నుంచి ఈ నెల 20 వరకు జరగనున్న ‘ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో’ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘ఆవిష్కర్తలు, పరిశోధకులు, ఔత్సాహికుల మధ్య ఉండటంవల్ల భారతీయ ప్రతిభ, ఏఐ సామర్థ్యం గురించి అవగాహన కలుగుతోంది. అందరం కలిసి మన దేశానికే కాకుండా అనేక సమస్యలపై ప్రపంచానికే పరిష్కారాలను చూపుతాం’ అని రాసుకొచ్చారు.


