News October 27, 2024

16,347 ఉద్యోగాల భర్తీపై BIG UPDATE

image

AP: 16,347 DSC ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. జిల్లాల వారీగా రోస్టర్ పాయింట్లు పరిశీలించి నివేదిక పంపించాలని డీఈవోలను పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. గతంలో జిల్లాల వారీగా ఖాళీలు, రోస్టర్ పాయింట్లు, సమాంతర రిజర్వేషన్లు, మహిళలు, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్, స్పోర్ట్స్ కోటా అమలుపై వివరాలను ఈ నెల 28లోగా పంపాలంది. కాగా వచ్చే నెల మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్సుంది.

Similar News

News October 27, 2024

షర్మిలది ఆస్తి తగాదా కాదు.. అధికార తగాదా: VSR

image

AP: ‘షర్మిలది ఆస్తి తగాదా కాదు అధికార తగాదా’ అని YCP MP విజయసాయిరెడ్డి విమర్శించారు. ‘షర్మిల ప్రెస్‌మీట్ పెట్టి తల్లి విజయమ్మ కన్నీళ్లు తుడవడానికని చెప్పారు. కానీ ఆ ప్రెస్‌మీట్ చంద్రబాబు కోసం పెట్టింది. ఆయన కళ్లలో ఆనందం చూసేందుకే ఆమె మీడియా ముందుకొచ్చారు. కొంతకాలంగా జగన్‌ను తిట్టేందుకే ప్రత్యేకంగా ప్రెస్‌మీట్లు పెడుతున్నారు. జగన్ మళ్లీ CM కావొద్దనే ఆమె పని చేస్తున్నారు’ అని మీడియాతో VSR అన్నారు.

News October 27, 2024

రేణూ దేశాయ్‌కి ఉపాసన సాయం!

image

నటి రేణూ దేశాయ్ ‘శ్రీ ఆద్య యానిమల్ షెల్టర్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. కుక్కలు, పిల్లులు వంటి మూగజీవాలను రెస్క్యూ చేయడమే ఈ సంస్థ పని. అందుకు విరాళాలు ఇవ్వాలని ఆమె కోరగా హీరో రామ్‌చరణ్ సతీమణి ఉపాసన స్పందించినట్లు తెలుస్తోంది. తన పెంపుడు శునకం రైమ్ పేరిట ఆమె ఈ సాయం చేశారట. దీంతో పెట్స్ రెస్క్యూ కోసం వ్యాన్ కొనుగోలుకు సాయం చేసినందుకు ‘థాంక్యూ రైమ్, ఉపాసన’ అంటూ రేణూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు.

News October 27, 2024

ఏపీలో మంచి ఎకో సిస్టం ఉంది: మంత్రి లోకేశ్

image

AP: రాష్ట్రంలో ప్రస్తుతం మంచి ఎకో సిస్టం ఉందని, అమెరికాలోని వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు ఏపీకి వచ్చి రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిందిగా మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ శ్రీకర్‌రెడ్డి ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలతో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా పంచుకున్నారు.