News October 27, 2024

ఏయూ: న్యాయవిద్య సెల్ఫ్ సపోర్ట్ కోర్సుల్లో దరఖాస్తుల ఆహ్వానం

image

ఏయూలో 5, 3 సంవత్సరాల న్యాయ విద్య సెల్ఫ్ సపోర్ట్ సీట్లలో ప్రవేశాలకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్ డీ.ఏ నాయుడు తెలిపారు. ఏపీ లా సెట్, క్లాట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారు నవంబర్ 7వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నవంబర్ 8వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రవేశాల సంచాలకుల కార్యాలయంలో కౌన్సిలింగ్ నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తారు.

Similar News

News September 20, 2025

కౌన్సిల్ తీర్మానం మేరకే ఆక్రమణలు తొలగింపు: జీవీఎంసీ కమిషనర్

image

జీవీఎంసీ కౌన్సిల్ తీర్మానానికి అనుగుణంగా ఫుడ్ కోర్ట్ తొలగించడం జరుగుతుందని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ శుక్రవారం తెలిపారు. ఫుడ్ కోర్ట్‌లో 160 దుకాణాలు అనధికారకంగా వ్యాపారాలను నిర్వహిస్తున్నారన్నారు. 2023లోని జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఫుడ్ కోర్ట్ తొలగింపునకు కౌన్సిల్ తీర్మానించదన్నారు. మరళ 2025 ఆగస్టు 22న జీవీఎంసీ కౌన్సిల్‌లో సభ్యుల అంగీకారంతో తీర్మానం జరిగిందన్నారు.

News September 19, 2025

విశాఖలో ‘ఆపరేషన్ లంగ్స్’

image

విశాఖలో ఆపరేషన్ లంగ్స్‌లో భాగంగా గురు, శుక్రవారాల్లో 1053 ఆక్రమణల తొలగించారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు ‘ఆపరేషన్ లంగ్స్’ చేపట్టినట్లు చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకరరావు తెలిపారు. జోన్-1లో 40 ఆక్రమణలు, జోన్-2లో 86, జోన్ -3లో 71, జోన్-4లో 11, జోన్-5లో 58, జోన్-6లో 110, జోన్- 7లో 52, జోన్-8లో 40 ఆక్రమణలు తొలగించారు. శుక్రవారం ఒక్కరోజే 529 ఆక్రమణలు తొలగించారు.

News September 19, 2025

జోధ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్‌ను సందర్శించిన మేయర్ బృందం

image

జోధ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు విశాఖ మేయర్ బృందం శుక్రవారం సందర్శించింది. మేయర్ పీలా శ్రీనివాసరావు నేతృత్వంలోని బృందం, జోధ్ పూర్ మేయర్ వనిత సేధ్, కమిషనర్ సిధ్దార్థ పళనిచామితో కలిసి అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. పారిశుద్ధ్యం, నీటి వనరులు, పచ్చదనం, వ్యర్ధాల నిర్వహణ వంటి అంశాలపై తెలుసుకున్నారు.