News October 27, 2024
కరెంట్ షాక్తో ‘యమరాజు’ కన్నుమూత

‘యమరాజు’గా పాపులర్ అయిన మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ జవహార్సింగ్ యాదవ్ కన్నుమూశారు. తాను పెంచుకుంటున్న ఆవును మేపుతుండగా కరెంట్ షాక్ తగిలి మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఆ ఆవు కూడా మరణించింది. కాగా ఆయన కరోనా సమయంలో యమ ధర్మరాజు వేషధారణలో వాహనదారులకు అవగాహన కల్పించారు. అప్పట్లో ‘యమరాజు’ వినూత్న ఆలోచనపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిశాయి.
Similar News
News February 3, 2026
నంద్యాల: 1930 గురించి తెలుసుకోండి.. చాలా ఉపయోగం!

ఆన్లైన్, బ్యాంక్, OTP, UPI/ATM/క్రెడిట్ కార్డు స్కామ్లు జరిగితే ఫిర్యాదు చేయడానికి ప్రభుత్వం 1930 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసింది. ఈ మధ్య సైబర్ మోసాలు ఎక్కువ కావడంతో కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మోసానికి గురైనప్పుడు 1930కి కాల్ చేస్తే బ్యాంక్కు అలర్ట్ పంపిస్తారు. https://cybercrime.gov.inలో కూడా ఫిర్యాదు చేయొచ్చు.
News February 3, 2026
పాక్ బాయ్ కాట్.. రూ.2,200కోట్ల నష్టం

T20 WCతో భారత్ మ్యాచ్ను బాయ్ కాట్ చేస్తామని పాక్ ప్రకటించిన నేపథ్యంలో భారీగా నష్టం కలిగే ఛాన్సుంది. ప్రసార హక్కులు, యాడ్స్ ధరలు, స్పాన్సర్షిప్, టికెట్ల విక్రయాలు తదితరాలు కలుపుకొని రూ.2,200CR వరకు లాస్ ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అటు IND-పాక్ బోర్డులకు కలిపి రూ.200CR వరకు నష్టం వాటిల్లొచ్చని చెబుతున్నాయి. ఇది BCCIకి చిన్న విషయమే అయినా పాక్ బోర్డుపై తీవ్ర ప్రభావం చూపనుంది.
News February 3, 2026
ట్రంప్ టారిఫ్స్.. మనకన్నా పాక్, బంగ్లాపైనే ఎక్కువ!

ఇండియాపై విధించిన 50% టారిఫ్స్ను 18%కు తగ్గిస్తున్నట్లు US అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది అమెరికాతో అంటగాగే పాక్, బంగ్లా కంటే తక్కువ కావడం గమనార్హం. బ్రెజిల్పై 50%, మయన్మార్-40, లావోస్-40, చైనా-37, సౌతాఫ్రికా-30, వియత్నాం-20, బంగ్లాదేశ్-20, శ్రీలంక-20, పాక్-19, మలేషియా-19, కాంబోడియా-19, థాయ్లాండ్పై 19% సుంకాలను ట్రంప్ విధించారు. అతితక్కువగా UKపై 10% వసూలు చేస్తున్నారు.


