News October 27, 2024
గాజాపై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయెల్.. 45 మంది మృతి
ఇరాన్పై ప్రతీకార దాడులకు దిగిన తరువాతి రోజే గాజాపై ఇజ్రాయెల్ దళాలు దండెత్తాయి. ఉత్తర గాజాలోని బీట్ లాహియాలో 6 భవనాలు లక్ష్యంగా జరిపిన దాడిలో 45 మంది మృతి చెందారు. పాలస్తీనాపై గ్రౌండ్ ఆపరేషన్స్, ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా అక్కడి మొత్తం జనాభా నిర్మూలనకు జరుగుతున్న వ్యవస్థీకృత దాడులను నిలువరించేలా అమెరికా కల్పించుకోవాలని అమెరికన్ ఇస్లామిక్ రిలేషన్స్ కౌన్సిల్ పిలుపునిచ్చింది.
Similar News
News October 27, 2024
విజయసాయి కూడా జగన్ మోచేతి నీళ్లు తాగిన వారే: షర్మిల
AP: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా జగన్ మోచేతి నీళ్లు తాగినవారే అని PCC చీఫ్ షర్మిల మండిపడ్డారు. జగన్ మాటలే ఆయన మాట్లాడుతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘విజయసాయి గారూ, మీరు చదివింది జగన్ స్క్రిప్ట్ కాదని ప్రమాణం చేయగలరా? ఆస్తులు నలుగురు బిడ్డలకు చెందాలని YS నిర్ణయించారు. కాదని ఆయన చెప్పగలరా? ఎవరినో ఇంప్రెస్ చేయాల్సిన అవసరం ఈ వైఎస్ బిడ్డకు ఎప్పటికీ రాదని మాట ఇస్తున్నా’ అంటూ ఆమె ట్వీట్ చేశారు.
News October 27, 2024
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు: AP పోలీస్
AP: దీపావళి వేళ అనుమతులు లేకుండా టపాసులు నిల్వ చేసినా, విక్రయించినా చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పుట్టపర్తిలో ఈమేరకు ఎస్పీ వి.రత్న ప్రకటన విడుదల చేశారు. నీరు, ఇసుక, తదితర అగ్నిమాపక సామగ్రిని టపాసుల విక్రయ దుకాణాల వద్ద సిద్ధంగా ఉంచుకోవాలని, అన్నింటికంటే ముఖ్యంగా లైసెన్సులు ఉన్నవారే విక్రయించాలని సూచించారు. పండుగ వేళ ఎక్కడైనా ప్రమాదాలు సంభవిస్తే వెంటనే 100 లేదా 112కు ఫోన్ చేయాలన్నారు.
News October 27, 2024
జగన్ ఓ విషపు నాగు: షర్మిల
AP: ఛార్జిషీట్లో వైఎస్ పేరు చేర్చిందే జగన్ అని పీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు నుంచి బయటపడేందుకు పొన్నవోలుతో కలిసి కుట్ర చేశారని ఆరోపించారు. ‘వైఎస్ మరణానికి చంద్రబాబు కారణమైతే ఐదేళ్లు అధికారంలో ఉండి గాడిదలు కాశారా? ప్రత్యేక విచారణ ఎందుకు జరిపించలేదు? చంద్రబాబుతో నాకు ఎలాంటి వ్యక్తిగత సంబంధాలు లేవు. స్వప్రయోజనాల కోసం తల్లిని కోర్టుకీడ్చిన విషపు నాగు జగన్’ అని ఆమె ట్వీట్ చేశారు.